Political News

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో లైవ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉండ‌గా.. తెలంగాణ‌లో పుంజుకుంటోంది. ఇక‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లోనూ మంచి స‌భ్య‌త్వం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అడుగులు దేశ రాజ‌ధాని ఢిల్లీ వైపుప‌డుతున్నాయి. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఢిల్లీలోనూ ప్రారంభ‌మైంది. ఇలా.. ద‌క్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజ‌ధానిలో స‌భ్య‌త్వం చేప‌ట్ట‌డం ఇదే తొలిసారి. ఈ ఘ‌న‌త టీడీపీకే ద‌క్కింది.

ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స్థాయిలోనే కాకుండా.. కేంద్ర ప్ర‌భుత్వంలోనూ టీడీపీ కీల‌క కీ రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. మోడీ ప్ర‌భుత్వం ముచ్చ‌ట‌గా మూడో సారి కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు.. టీడీపీ కీలక‌మేన‌న్న విష‌యం తెలిసిందే. ఎన్డీయే కూట‌మిలో కీల‌క భూమిక కూడా పోషిస్తోంది. ఈ క్ర‌మంలో దేశ‌రాజ‌ధానిలో పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దాదాపు 500 మంది ఆదివారం ఒక్క‌రోజేపార్టీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. వీరికి పార్టీ నాయ‌కులు గుర్తింపు కార్డుతోపాటు.. టీడీపీ కండువాను అందించారు.

టుగెద‌ర్ ప్రోగ్రెస్‌-టుగెద‌ర్ విత్ టీడీపీ.. పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స‌ద‌ర‌న్ ట్రావెల్స్ అధినేత‌, టీడీపీ సీనియ‌ర్ నాయకుడు ఆల‌పాటి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో 500 మందికిపైగానే టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఒక్కొక్క‌రు రూ.100 చెల్లించి పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆల‌పాటి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని దేశ‌వ్యాప్తంగా వినిపిస్తామ‌న్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు.

రూ.100 చెల్లించి.. పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న‌వారికి ప్ర‌మాద బీమాతో పాటు.. చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చులు కూడా బీమా రూపం లో అందుతాయ‌ని ఆల‌పాటి వివ‌రించారు. వ‌చ్చే రెండు వారాల పాటు క్యాంపులు ఏర్పాటు చేసి స‌భ్య‌త్వాలు ఇవ్వ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారి నుంచి భారీ స్పంద‌న వ‌స్తున్న‌ట్టు వివ‌రించారు.

Satya

Recent Posts

అఖిల్.. సమంత… ఒకరికోసం ఒకరు

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్…

51 minutes ago

రేవంత్ ఫ్లెక్సిలో జగన్ ఫొటో!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న…

60 minutes ago

‘రావణ్’ రంగంలోకి పొన్నవోలును దించిన జగన్

రాజకీయ నేతలు...ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్…

1 hour ago

డైరెక్టర్ కథ చెబితే… సీన్లు, డైలాగులు లేపేశారట

డైరెక్టర్ కావాలన్న ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లకు ఏళ్ళు కష్టపడి కొంత అనుభవం సంపాదించాక.. కథలు తయారు చేసుకుని హీరోలు,…

1 hour ago

అయ్యగారు ఫ్యాన్ వచ్చాడు… సందడి తెచ్చాడు

ఈ సోషల్ మీడియా కాలంలో ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో.. వైరల్ అయిపోతారో చెప్పలేం. కొన్నేళ్ళ ముందు అక్కినేని కుర్రాడు…

3 hours ago

ఈ దెబ్బకు గిరిజన ఓటు బ్యాంకు పవన్ సొంతం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు.. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజ‌న ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా…

3 hours ago