తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో లైవ్లో ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో పుంజుకుంటోంది. ఇక, తమిళనాడు, కర్ణాటకలోనూ మంచి సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అడుగులు దేశ రాజధాని ఢిల్లీ వైపుపడుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఢిల్లీలోనూ ప్రారంభమైంది. ఇలా.. దక్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో సభ్యత్వం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత టీడీపీకే దక్కింది.
ప్రస్తుతం పార్లమెంటు స్థాయిలోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కీలక కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడో సారి కేంద్రంలో చక్రం తిప్పేందుకు.. టీడీపీ కీలకమేనన్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో కీలక భూమిక కూడా పోషిస్తోంది. ఈ క్రమంలో దేశరాజధానిలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు 500 మంది ఆదివారం ఒక్కరోజేపార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరికి పార్టీ నాయకులు గుర్తింపు కార్డుతోపాటు.. టీడీపీ కండువాను అందించారు.
టుగెదర్ ప్రోగ్రెస్-టుగెదర్ విత్ టీడీపీ.. పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ అధినేత, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 500 మందికిపైగానే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఒక్కొక్కరు రూ.100 చెల్లించి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తామన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
రూ.100 చెల్లించి.. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమాతో పాటు.. చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా బీమా రూపం లో అందుతాయని ఆలపాటి వివరించారు. వచ్చే రెండు వారాల పాటు క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారి నుంచి భారీ స్పందన వస్తున్నట్టు వివరించారు.
This post was last modified on December 23, 2024 9:55 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…