తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో లైవ్లో ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో పుంజుకుంటోంది. ఇక, తమిళనాడు, కర్ణాటకలోనూ మంచి సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఈ పార్టీ అడుగులు దేశ రాజధాని ఢిల్లీ వైపుపడుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఢిల్లీలోనూ ప్రారంభమైంది. ఇలా.. దక్షిణాదికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో సభ్యత్వం చేపట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత టీడీపీకే దక్కింది.
ప్రస్తుతం పార్లమెంటు స్థాయిలోనే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కీలక కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడో సారి కేంద్రంలో చక్రం తిప్పేందుకు.. టీడీపీ కీలకమేనన్న విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమిలో కీలక భూమిక కూడా పోషిస్తోంది. ఈ క్రమంలో దేశరాజధానిలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దాదాపు 500 మంది ఆదివారం ఒక్కరోజేపార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరికి పార్టీ నాయకులు గుర్తింపు కార్డుతోపాటు.. టీడీపీ కండువాను అందించారు.
టుగెదర్ ప్రోగ్రెస్-టుగెదర్ విత్ టీడీపీ.. పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ అధినేత, టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 500 మందికిపైగానే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఒక్కొక్కరు రూ.100 చెల్లించి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దేశవ్యాప్తంగా వినిపిస్తామన్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
రూ.100 చెల్లించి.. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాద బీమాతో పాటు.. చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా బీమా రూపం లో అందుతాయని ఆలపాటి వివరించారు. వచ్చే రెండు వారాల పాటు క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఢిల్లీలో ఉండే తెలుగు వారి నుంచి భారీ స్పందన వస్తున్నట్టు వివరించారు.
This post was last modified on December 23, 2024 9:55 am
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…