ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు మరిన్ని కేసులు నమోదు చేసేందుకురెడీ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అనంతరం.. అనూహ్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.
అల్లు అర్జున్కు అన్నీ స్పాట్లోనే తెలుసునని.. తొక్కిసలాట జరిగిందని.. రేవతి అనే మహిళ మృతి చెందారని.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారని కూడా తెలిసిందన్నారు. అయినప్పటికీ.. ఆయన తమ మాట వినిపించుకోకుండా.. సినిమా పూర్తిగా వీక్షించిన తర్వాతే ఇంటికి వెళ్తానని భీష్మించినట్టు చెప్పారు. డిసెంబరు 4న రాత్రి సంధ్య ధియేటర్ వద్ద విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీలతో కలిసి ఆనంద్ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.
డిసెంబర్ 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీగా అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారని తెలిపారు. దీంతోనే తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహారించిందన్నారు. ఈ ఘటనలో అర్జున్ సహా ధియేటర్ యాజమాన్యం.. పాత్ర కూడా ఉందని.. దీనికి సంబంధించిన వీడియోనే పక్కాగా ఉందన్నారు. ఇది చూసిన తర్వాత.. సామాన్యులకు కూడా అర్జున్ పాత్ర ఏంటనేది అర్థమవుతుందన్నారు.
ఏసీపీ మాట్లాడుతూ.. డిసెంబరు 4న ప్రీమియర్ షో చూసేందుకు అర్జున్ వచ్చారని.. తాము అప్పటికే ఆయనను వద్దని వారించామని.. అయినా.. ఆయన వచ్చారన్నారు. అర్జున్ను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కు తాము చెప్పినట్టు తెలిపారు. అర్జున్కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదన్నారు.
థియేటర్ యాజమాన్యమే ఈ విషయాన్ని అర్జున్ కు చెబుతామని చెప్పిందని ఏసీపీ తెలిపారు. తొక్కిస లాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని, డీసీపీ ఆర్డర్ ప్రకారం తానే జోక్యం చేసుకుని వెళ్లిపోవాలని ఆదేశించానన్నారు. కానీ ఆయన సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్ను బయటకు తీసుకువచ్చామని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
This post was last modified on December 23, 2024 9:47 am
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…