ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు మరిన్ని కేసులు నమోదు చేసేందుకురెడీ అవుతున్నట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన అనంతరం.. అనూహ్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.
అల్లు అర్జున్కు అన్నీ స్పాట్లోనే తెలుసునని.. తొక్కిసలాట జరిగిందని.. రేవతి అనే మహిళ మృతి చెందారని.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారని కూడా తెలిసిందన్నారు. అయినప్పటికీ.. ఆయన తమ మాట వినిపించుకోకుండా.. సినిమా పూర్తిగా వీక్షించిన తర్వాతే ఇంటికి వెళ్తానని భీష్మించినట్టు చెప్పారు. డిసెంబరు 4న రాత్రి సంధ్య ధియేటర్ వద్ద విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీలతో కలిసి ఆనంద్ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.
డిసెంబర్ 4న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీగా అర్జున్ ఫ్యాన్స్ తరలివచ్చారని తెలిపారు. దీంతోనే తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహారించిందన్నారు. ఈ ఘటనలో అర్జున్ సహా ధియేటర్ యాజమాన్యం.. పాత్ర కూడా ఉందని.. దీనికి సంబంధించిన వీడియోనే పక్కాగా ఉందన్నారు. ఇది చూసిన తర్వాత.. సామాన్యులకు కూడా అర్జున్ పాత్ర ఏంటనేది అర్థమవుతుందన్నారు.
ఏసీపీ మాట్లాడుతూ.. డిసెంబరు 4న ప్రీమియర్ షో చూసేందుకు అర్జున్ వచ్చారని.. తాము అప్పటికే ఆయనను వద్దని వారించామని.. అయినా.. ఆయన వచ్చారన్నారు. అర్జున్ను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కు తాము చెప్పినట్టు తెలిపారు. అర్జున్కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదన్నారు.
థియేటర్ యాజమాన్యమే ఈ విషయాన్ని అర్జున్ కు చెబుతామని చెప్పిందని ఏసీపీ తెలిపారు. తొక్కిస లాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని, డీసీపీ ఆర్డర్ ప్రకారం తానే జోక్యం చేసుకుని వెళ్లిపోవాలని ఆదేశించానన్నారు. కానీ ఆయన సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్ను బయటకు తీసుకువచ్చామని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
This post was last modified on December 23, 2024 9:47 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…