Political News

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. ఆదివారం కీల‌క‌మైన శాంతిపురం మండ‌ల ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య టించారు. నేటితో ఆమె ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో చేల్ద‌గాని ప‌ల్లె గ్రామంలో ఆమె డ్వాక్రా మ హిళా సంఘాల‌తో భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి వారికి అందుతు న్న రుణ స‌దుపాయాలు, సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాలు అడిగారు. మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ప్ర‌భు త్వం కృషి చేస్తుంద‌న్నారు.

అనంత‌రం నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. నారా కుటుంబం.. ఐదు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉంద‌ని తెలిపారు. ఏనాడైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల నుంచి ఒక్క‌రూపాయి కూడా నారా కుటుం బం ఆశించ‌లేద‌ని చెప్పారు. కానీ కొన్ని మీడియాలు.. నారా కుటుంబానికి వ్య‌తిరేకంగా క‌థ‌లు రాస్తూ.. ఆవేద‌న‌కు గురి చేస్తున్నాయ‌ని ఆరోపించారు. నారా కుటుంబం చేస్తున్న సేవ‌లు.. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల కు చేరుతున్నాయ‌ని చెప్పారు. త‌మ కుటుంబం ఉన్న‌న్నాళ్లూ ఈ సేవ‌లు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.

ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌వించార‌ని.. ప్ర‌జ‌లు అనుభ‌వించిన బాధ‌ల‌తో పోలిస్తే.. నారా కుటుంబం అనుభ‌వించిన బాధ‌లు త‌క్కువేన‌ని చెప్పారు. అయినా.. చంద్ర‌బాబును జైలుకు పంపించ‌డం త‌మ కుటుంబంలో పెద్ద ఆవేద‌న‌ను క‌లిగించింద‌న్నారు. అయినా.. ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేశార‌ని భువ‌నేశ్వ‌రి చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు కూడా.. త‌మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని వివ‌రించారు. కుప్పం ప్ర‌జ‌ల రుణం తీర్చుకోలేనిద‌ని చెప్పారు.

ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు. నారా కుటుంబం అంటే.. పెట్టే చెయ్యే కానీ.. తీసుకునే చెయ్యి కాద‌న్నారు. ఈ విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని.. కానీ, కొంద‌రికి తెలియ‌క పోవ‌డం బాధాక‌రంగా ఉంద‌ని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఏ కష్టం వ‌చ్చినా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

This post was last modified on December 22, 2024 3:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

2 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

6 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

13 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

24 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

50 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago