ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా భువనేశ్వరి.. ఆదివారం కీలకమైన శాంతిపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్య టించారు. నేటితో ఆమె పర్యటన ముగియనుంది. ఈ క్రమంలో చేల్దగాని పల్లె గ్రామంలో ఆమె డ్వాక్రా మ హిళా సంఘాలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతు న్న రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాల వివరాలు అడిగారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా కుటుంబం.. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉందని తెలిపారు. ఏనాడైనా ప్రజలకు సేవ చేయడమే తప్ప.. ప్రజల నుంచి ఒక్కరూపాయి కూడా నారా కుటుం బం ఆశించలేదని చెప్పారు. కానీ కొన్ని మీడియాలు.. నారా కుటుంబానికి వ్యతిరేకంగా కథలు రాస్తూ.. ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. నారా కుటుంబం చేస్తున్న సేవలు.. లక్షల మంది ప్రజల కు చేరుతున్నాయని చెప్పారు. తమ కుటుంబం ఉన్నన్నాళ్లూ ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని.. ప్రజలు అనుభవించిన బాధలతో పోలిస్తే.. నారా కుటుంబం అనుభవించిన బాధలు తక్కువేనని చెప్పారు. అయినా.. చంద్రబాబును జైలుకు పంపించడం తమ కుటుంబంలో పెద్ద ఆవేదనను కలిగించిందన్నారు. అయినా.. ప్రజల కోసం చంద్రబాబు అలుపెరుగని విధంగా పనిచేశారని భువనేశ్వరి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా.. తమకు బ్రహ్మరథం పట్టారని వివరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు.
ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నారా భువనేశ్వరి తెలిపారు. నారా కుటుంబం అంటే.. పెట్టే చెయ్యే కానీ.. తీసుకునే చెయ్యి కాదన్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలుసునని.. కానీ, కొందరికి తెలియక పోవడం బాధాకరంగా ఉందని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కుప్పం ప్రజలకు తాను అండగా ఉంటానని.. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
This post was last modified on December 22, 2024 3:50 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…