ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా భువనేశ్వరి.. ఆదివారం కీలకమైన శాంతిపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్య టించారు. నేటితో ఆమె పర్యటన ముగియనుంది. ఈ క్రమంలో చేల్దగాని పల్లె గ్రామంలో ఆమె డ్వాక్రా మ హిళా సంఘాలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతు న్న రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాల వివరాలు అడిగారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు.
అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా కుటుంబం.. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉందని తెలిపారు. ఏనాడైనా ప్రజలకు సేవ చేయడమే తప్ప.. ప్రజల నుంచి ఒక్కరూపాయి కూడా నారా కుటుం బం ఆశించలేదని చెప్పారు. కానీ కొన్ని మీడియాలు.. నారా కుటుంబానికి వ్యతిరేకంగా కథలు రాస్తూ.. ఆవేదనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. నారా కుటుంబం చేస్తున్న సేవలు.. లక్షల మంది ప్రజల కు చేరుతున్నాయని చెప్పారు. తమ కుటుంబం ఉన్నన్నాళ్లూ ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని.. ప్రజలు అనుభవించిన బాధలతో పోలిస్తే.. నారా కుటుంబం అనుభవించిన బాధలు తక్కువేనని చెప్పారు. అయినా.. చంద్రబాబును జైలుకు పంపించడం తమ కుటుంబంలో పెద్ద ఆవేదనను కలిగించిందన్నారు. అయినా.. ప్రజల కోసం చంద్రబాబు అలుపెరుగని విధంగా పనిచేశారని భువనేశ్వరి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా.. తమకు బ్రహ్మరథం పట్టారని వివరించారు. కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు.
ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నారా భువనేశ్వరి తెలిపారు. నారా కుటుంబం అంటే.. పెట్టే చెయ్యే కానీ.. తీసుకునే చెయ్యి కాదన్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలుసునని.. కానీ, కొందరికి తెలియక పోవడం బాధాకరంగా ఉందని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కుప్పం ప్రజలకు తాను అండగా ఉంటానని.. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
This post was last modified on December 22, 2024 3:50 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…