పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు.. ఆ వెంటనే శనివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు రావడం.. వంటి పరిణామాలు.. ఈ ఘటనను మరింత చర్చనీయాంశం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. అల్లు అర్జున్కు బాసటగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని ఆమె నివాసంలో మీడియా తో మాట్లాడిన పురందేశ్వరి.. తన సినిమా విడుదల సందర్భంగా.. వీక్షించేందుకు అల్లు అర్జున్ వెళ్లారని.. దీనిలో తప్పు ఏముందని ప్రశ్నించారు.
అంతేకాదు.. అల్లు అర్జున్ ఈ కేసు ఏ11గా ఉన్నారని.. మొదటి 10 మంది నిందితులను వదిలేసి.. ఏ11గా ఉన్న అర్జున్ను అరెస్టు చేయడం వెనుక ఏముందో అర్ధం చేసుకోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఇలాంటి సున్నితమైన విషయాల్లో నేరుగా స్పందించడంపైనా చర్చ జరగాలని పురందేశ్వరి పేర్కొన్నారు. తొక్కిసలాటను అల్లు ఏమైనా ప్రేరిపించారా? అని ఆమె ప్రశ్నించారు.
“ఒక మహిళగా .. రేవతి మృతిని జీర్ణించుకోలేను. కానీ, ఆ ఘటన తర్వాత.. జరుగుతున్న పరిణామాలు కూడా అంతే బాధగా ఉన్నాయి. ఈ విషయంలో అర్జున్ తప్పేంటి? ఆయనను అంత హడావుడిగా అరెస్టు చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా.. సంయమనం పాటిస్తే.. అందరికీ బాగుంటుందని తేల్చి చెప్పారు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…