Political News

అల్లు అర్జున్‌కు పురందేశ్వ‌రి మ‌ద్ద‌తు

పుష్ప‌-2 సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య ధియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌.. ఈ క్ర‌మంలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌డం.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కొంద‌రు నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు.. ఆ వెంట‌నే శ‌నివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు రావ‌డం.. వంటి ప‌రిణామాలు.. ఈ ఘ‌ట‌న‌ను మ‌రింత చ‌ర్చ‌నీయాంశం చేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌, రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి స్పందించారు. అల్లు అర్జున్‌కు బాస‌ట‌గా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “జ‌రిగిన ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ త‌ప్పు ఎక్క‌డుందో నాకు అర్థం కావడం లేదు” అని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఆదివారం ప్ర‌కాశం జిల్లాలోని ఆమె నివాసంలో మీడియా తో మాట్లాడిన పురందేశ్వ‌రి.. త‌న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా.. వీక్షించేందుకు అల్లు అర్జున్ వెళ్లార‌ని.. దీనిలో త‌ప్పు ఏముందని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. అల్లు అర్జున్ ఈ కేసు ఏ11గా ఉన్నార‌ని.. మొద‌టి 10 మంది నిందితుల‌ను వ‌దిలేసి.. ఏ11గా ఉన్న అర్జున్‌ను అరెస్టు చేయ‌డం వెనుక ఏముందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వాలు ఇలాంటి సున్నిత‌మైన విష‌యాల్లో నేరుగా స్పందించ‌డంపైనా చ‌ర్చ జ‌ర‌గాల‌ని పురందేశ్వ‌రి పేర్కొన్నారు. తొక్కిస‌లాట‌ను అల్లు ఏమైనా ప్రేరిపించారా? అని ఆమె ప్ర‌శ్నించారు.

“ఒక మ‌హిళ‌గా .. రేవ‌తి మృతిని జీర్ణించుకోలేను. కానీ, ఆ ఘ‌ట‌న త‌ర్వాత‌.. జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా అంతే బాధ‌గా ఉన్నాయి. ఈ విష‌యంలో అర్జున్ త‌ప్పేంటి? ఆయ‌న‌ను అంత హ‌డావుడిగా అరెస్టు చేయాల్సి వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు” అని పురందేశ్వ‌రి వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు ఏవైనా కూడా.. సంయ‌మ‌నం పాటిస్తే.. అంద‌రికీ బాగుంటుంద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on December 22, 2024 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

24 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago