పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు.. ఆ వెంటనే శనివారం రాత్రి అల్లు అర్జున్ మీడియా ముందుకు రావడం.. వంటి పరిణామాలు.. ఈ ఘటనను మరింత చర్చనీయాంశం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి స్పందించారు. అల్లు అర్జున్కు బాసటగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని ఆమె నివాసంలో మీడియా తో మాట్లాడిన పురందేశ్వరి.. తన సినిమా విడుదల సందర్భంగా.. వీక్షించేందుకు అల్లు అర్జున్ వెళ్లారని.. దీనిలో తప్పు ఏముందని ప్రశ్నించారు.
అంతేకాదు.. అల్లు అర్జున్ ఈ కేసు ఏ11గా ఉన్నారని.. మొదటి 10 మంది నిందితులను వదిలేసి.. ఏ11గా ఉన్న అర్జున్ను అరెస్టు చేయడం వెనుక ఏముందో అర్ధం చేసుకోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ఇలాంటి సున్నితమైన విషయాల్లో నేరుగా స్పందించడంపైనా చర్చ జరగాలని పురందేశ్వరి పేర్కొన్నారు. తొక్కిసలాటను అల్లు ఏమైనా ప్రేరిపించారా? అని ఆమె ప్రశ్నించారు.
“ఒక మహిళగా .. రేవతి మృతిని జీర్ణించుకోలేను. కానీ, ఆ ఘటన తర్వాత.. జరుగుతున్న పరిణామాలు కూడా అంతే బాధగా ఉన్నాయి. ఈ విషయంలో అర్జున్ తప్పేంటి? ఆయనను అంత హడావుడిగా అరెస్టు చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు” అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా.. సంయమనం పాటిస్తే.. అందరికీ బాగుంటుందని తేల్చి చెప్పారు.
This post was last modified on December 22, 2024 1:52 pm
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…