Political News

అసెంబ్లీ లో పుష్ప వివాదం : సిఎం రేవంత్ ఫైర్!

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ విషయంలో విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక చర్చా వేదికలో దీటుగా సమాధానం చెప్పారు. తాజాగా అసెంబ్లీలో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరగా.. ముఖ్యమంత్రి కొంచెం సుదీర్ఘంగానే మాట్లాడారు.

ఈ కేసు విషయం పై ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఏమన్నారంటే..‘‘సంధ్య థియేటర్ ఘటన అసెంబ్లీలో చర్చకు వస్తుందని అనుకోలేదు. సభ్యులు ఈ విషయంపై ప్రస్తావించారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందు వల్ల పెద్దగా మాట్లాడకూడదు. ఇలా చేస్తే దర్యాప్తు అధికారి ఇబ్బందుల్లో పడతారు. డిసెంబరు 2న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంధ్య థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఈ నెల 4న ‘పుష్ప-2’ సినిమా ప్రదర్శనకు హీరో హీరోయిన్లు, మరికొందరు థియేటర్‌కు వస్తున్నారని, బందోబస్తు కావాలని అడిగారు.

మరుసటి రోజు పోలీసులు థియేటర్‌కు లిఖిత పూర్వక సమాధానం పంపారు. సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయి. సెలబ్రెటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టమవుతుంది. కాబట్టి సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. హీరో హీరోయిన్లు ఎవరైనా వస్తే థియేటర్‌కు అనుమతి ఇవ్వొద్దని.. దరఖాస్తును తిరస్కరిస్తున్నామని చెప్పారు. అయినా సరే ప్రిమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు.

నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదు. కానీ క్రాస్ రోడ్డు నుంచి కారులో రూప్ టాప్ మీదికి ఎక్కి చేతులు ఊపుతో సంధ్య థియేటర్‌కు చేరుకున్నారు. అప్పుడు హీరోను చూడాలని అభిమానులు థియేటర్ నుంచి తోసుకుంటూ బయటికి వచ్చారు. హీరో కారును లోపలికి పంపించేందుకు గేటు తెరవగా.. వందల మంది అభిమానులు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది.

ఆమె కొడుక్కి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. చికిత్స జరుగుతోంది. ఆ సమయంలో పరిస్థితి అదుపు దాటుతోందని, వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పాలని ప్రయత్నించారు. కానీ అతను మాత్రం సినిమా చూసే వెళ్తానని అన్నట్లు సిటీ కమిషనర్ నాతో చెప్పారు. ఎలాగోలా పోలీసులు బలవంతంగా అతణ్ని అక్కడి నుంచి పంపించాలని చూస్తే.. మరోసారి రూప్ టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు. మహిళ చనిపోయింది, ఆమె కొడుు పరిస్థితి విషమంగా ఉందని తెలిసీ అదే పద్ధతి కొనసాగించారు’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

This post was last modified on December 21, 2024 4:23 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago