ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారా? అంటే.. సీఎం చంద్రబాబే ఔనని చెబుతున్నారు. తాజాగా ఆయన అధికారుల ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాను మళ్లీ సర్ప్రైజ్ విజిట్స్కు రానున్నట్టు తేల్చిచెప్పారు. “ఇప్పుడు చెప్పి వచ్చాను. ఇక, నుంచి చెప్పి మాత్రం రాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా. అధికారుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకుంటా” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. ఎక్కువగా వైసీపీ హయాంలో భూముల అక్రమాలకు సంబంధించే ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుసుకున్నారు. వీటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అయితే.. కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయని.. భూబకాసుల మాదిరిగా.. వైసీపీ నాయకులు ఎగబడి మరీ ప్రజల ఆస్తులను దోచుకున్నారని విమర్శించారు.
అయినప్పటికీ.. ప్రజల ఆస్తులను పరిరక్షించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరి ఆస్తికీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని.. కబ్జాదారుల నుంచి ఆస్తులను వెనక్కి తీసుకుని, వారిని కటకటాల్లోకి నెడతామని తెలిపారు. అనంతరం.. అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది పనిలో అలసత్వం వహిస్తున్నారని.. తాను ఈ లోపాలను గమనిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు అయింది అయిపోయిందని.. కానీ, ఇక నుంచి మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.
ఆర్టీజీఎస్ ద్వారా.. తాను అన్నీ తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం చెప్పి వచ్చానన్న ఆయన ఇక నుంచి చెప్పకుండానే పర్యటనలకు వస్తానని.. అప్పుడు అధికారుల తీరును నేరుగా గమనిస్తానని తెలిపారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. “ఇక నుంచి ఉపేక్షించేది లేదు. అందరూ తమ పనితీరును మెరుగు పరుచుకోవాలి” అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
This post was last modified on December 20, 2024 10:23 pm
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…