Political News

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేయ‌నున్నారా? అంటే.. సీఎం చంద్ర‌బాబే ఔన‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న అధికారుల ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంలో తాను మ‌ళ్లీ స‌ర్‌ప్రైజ్ విజిట్స్‌కు రానున్న‌ట్టు తేల్చిచెప్పారు. “ఇప్పుడు చెప్పి వ‌చ్చాను. ఇక‌, నుంచి చెప్పి మాత్రం రాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆక‌స్మిక ప‌ర్య‌ట‌నలు చేస్తా. అధికారుల ప‌నితీరును ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటా” అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని ఈడుపుగ‌ల్లులో శుక్ర‌వారం నిర్వ‌హించిన రెవెన్యూ స‌ద‌స్సులో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ స‌ద‌స్సుకు వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదుల‌ను తీసుకున్నారు. ఎక్కువ‌గా వైసీపీ హ‌యాంలో భూముల అక్ర‌మాలకు సంబంధించే ఫిర్యాదులు వ‌స్తున్న‌ట్టు తెలుసుకున్నారు. వీటిని స‌త్వ‌రం ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. అయితే.. కొన్ని న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ఉన్నాయ‌ని.. భూబ‌కాసుల మాదిరిగా.. వైసీపీ నాయ‌కులు ఎగ‌బ‌డి మ‌రీ ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకున్నార‌ని విమ‌ర్శించారు.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ప‌రిర‌క్షించే బాధ్య‌త‌ను త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని సీఎం తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి ఆస్తికీ ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని.. క‌బ్జాదారుల నుంచి ఆస్తుల‌ను వెన‌క్కి తీసుకుని, వారిని క‌ట‌క‌టాల్లోకి నెడ‌తామ‌ని తెలిపారు. అనంత‌రం.. అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది ప‌నిలో అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని.. తాను ఈ లోపాలను గ‌మ‌నిస్తున్నాన‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయింది అయిపోయింద‌ని.. కానీ, ఇక నుంచి మాత్రం ఉపేక్షించేది లేద‌న్నారు.

ఆర్టీజీఎస్ ద్వారా.. తాను అన్నీ తెలుసుకుంటాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం చెప్పి వ‌చ్చాన‌న్న ఆయ‌న ఇక నుంచి చెప్ప‌కుండానే ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తానని.. అప్పుడు అధికారుల తీరును నేరుగా గ‌మ‌నిస్తాన‌ని తెలిపారు. ప‌నితీరు మార్చుకోక‌పోతే ప‌రిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల‌కు అధికారులు అందుబాటులో ఉండాల‌ని సూచించారు. అదేవిధంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు. “ఇక నుంచి ఉపేక్షించేది లేదు. అంద‌రూ త‌మ ప‌నితీరును మెరుగు ప‌రుచుకోవాలి” అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

This post was last modified on December 20, 2024 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago