Political News

గిరిజనుల కోసం చెప్పులు లేకుండా కిలో మీటర్ నడిచిన పవన్!

దశాబ్దాలుగా డోలీలలో గిరిజనులు పడుతున్న అవస్థలకు చరమగీతం పడేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుము బిగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎంతో మంది నాయకులుతమకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి మరిచారు. అయినా సరే గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకంగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేసేందుకు పవన్ ఈరోజు శ్రీకారం చుట్టారు.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రూ.49.73 కోట్లతో 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ.ల మేర రోడ్డు పనులకు పవన్ నేడు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌కి 500 కోట్లు ఖర్చుపెట్టిందని, కానీ, గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని పవన్ విమర్శించారు. కిలోమీటర్ నడిస్తేగానీ గిరిజనుల సమస్యలు తెలియవనే ఉద్దేశంతో కలెక్టర్ వర్షం పడుతోందని చెప్పినా కూడా వినకుండా నడుచుకుంటూ వచ్చానని అన్నారు.

డోలీలలో గర్భిణిని తీసుకురావడానికి ఎంత ఇబ్బందిపడతారనేదీ తెలియాలనే తాను కూడా నడిచానని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చమని కోరేందుకు తిరుమల కొండ ఎక్కానని, గిరిజనుల కష్టాలు తెలుసుకునేందుకు, వాటిని తీర్చేందుకు ఈ కొండ ఎక్కానని పవన్ అన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై 2 నెలలకు ఒకసారి ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రకటిస్తానని ప్రకటించారు. 2027 లోపు ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు.

డోలీలో చనిపోయింది నా అక్కా చెల్లెళ్ళు అని భావించానని అన్నారు. ఇకపై ఆ డోలి కష్టాలకు చెల్లు చీటీ పడాలని, భవిష్యత్తులో ఎవరు ఆ విధంగా చనిపోకూడదని తాను ఇక్కడికి వచ్చాను అని పవన్ అన్నారు.2019లో తనను ఓడించారని, నాయకుడిగా నేను నిలబడతానో లేదో అని తనను మన్యం ప్రజలు పరీక్షించారని గాజువాక ఓటమి గురించి పవన్ మాట్లాడారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు స్వయంగా వచ్చిన పవన్ కళ్యాణ్ పై గిరిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ నాయకుడు తమను పట్టించుకోలేదని, ఈ మహానుభావుడు వచ్చాడని గిరిజన మహిళలు చెబుతున్న మాటలు వైరల్ గా మారాయి.

This post was last modified on December 20, 2024 5:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

2 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

6 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

7 hours ago