Political News

ఇచ్చిన మాట కోసం: నారా భువ‌నేశ్వ‌రి టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. 4 రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం.. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పానికి వ‌చ్చారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆమె కేవ‌లం ఒక చోట కూర్చోకుండా.. మొత్తంగా నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని 12 గ్రామాల్లోనూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసేలా షెడ్యూల్ నిర్ణ‌యిం చుకున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు.. నారా భువ‌నేశ్వ‌రి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును మ‌ళ్లీ గెలిపించాల‌ని ఆమె విన్న‌వించారు.

అంతేకాదు.. ఎక్కువ మెజారిటీ వ‌చ్చిన మండ‌లాల‌ను తాను ద‌త్తత తీసుకుని.. అభివృద్ధి చేస్తాన‌ని మాటిచ్చారు. ఆమె ఇచ్చిన పిలుపును స్వీక‌రించిన ఓట‌ర్లు.. నారా చంద్ర‌బాబును భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ క్ర‌మంలో కుప్పంపై నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. కూట‌మి స‌ర్కారు ప‌గ్గాలుచేప‌ట్టిన త‌ర్వాత‌.. వ‌రుస‌గా ఆమె కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు మాసాల కింద‌ట భువ‌నేశ్వ‌రి కుప్పంలో ప‌ర్య‌టించారు. తాజాగా మ‌రోసారి 4 రోజుల షెడ్యూల్‌తో ఆమె కుప్పానికి వెళ్లారు.

అయితే.. ఈ సారి నారా భువ‌నేశ్వ‌రి పెద్ద ప్ర‌ణాళిక‌తోనే కుప్పంలో ప‌ర్య‌టిస్తున్నారు. మొత్తంగా 12 గ్రామాల్లో ఆమె ప‌ర్య‌టించి.. అభివృద్ధికి సంబంధించిన ప‌నుల‌ను చేప‌ట్ట‌నున్నారు. 4 రోజుల్లో 12 గ్రామాల‌ను చుట్టి వ‌చ్చేలా ప్ర‌ణాళిక రెడీ చేసుకున్నారు. మ‌రీముఖ్యంగా మ‌హిళ‌ల ఆర్థిక బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్న ఆమె.. దానికి అనుగుణంగా ప్ర‌త్యేక శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ.. ఎన్టీఆర్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ణ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

కుప్పం మండలం వెంగాటుపల్లి గ్రామం, అడవి బూదుగూరు గ్రామం, గుండ్ల మడుగు, డీకే పల్లిలో మహిళలతో ముచ్చటించి వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. వారికి మెరుగైన జీవ‌నోపాధుల క‌ల్ప‌న‌తో పాటు.. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌పైనా నారా భువ‌నేశ్వ‌రి దృష్టి పెట్ట‌నున్నారు. ఆర్థికంగా బ‌లోపేతానికి కృషి చేయ‌నున్నారు. అయితే.. నారా భువ‌నేశ్వ‌రి ఇలా తొలిసారి కుప్పంపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డంతో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా అలెర్ట్ అయ్యారు.

This post was last modified on December 20, 2024 5:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుపరిపాలన రూపశిల్పి చంద్రబాబే

1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…

12 minutes ago

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

28 minutes ago

‘పులిరాజు’ ఫోటో వెనుక అసలు కథ

ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…

42 minutes ago

అరవింద్ మాటల్లో అర్థముందా అపార్థముందా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…

46 minutes ago

బాలయ్యకు తిరుగు లేదు… ‘హిందూపురం’పై టీడీపీ జెండా

టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…

1 hour ago

వరల్డ్ కప్ వీర వనితలకు బీసీసీఐ భారీ నజరానా!

మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…

1 hour ago