Political News

తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ చర్యలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

టీటీడీ చైర్మన్ ప్రకటనలో తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు ఎవరు చేసినా అనుకూలించేది లేదని పేర్కొన్నారు. తిరుమల ప్రశాంతతను కాపాడే విషయంలో పాలకమండలి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలోనే తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని హెచ్చరించినప్పటికీ, తాజాగా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని టీటీడీ అభిప్రాయపడింది. ఈ విషయంపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి స్పష్టం చేసింది.

గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను సమానంగా చూడాలని, అంతకుముందు కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా వ్యాపారులు, పదవుల్లో ఉండే వారు తెలంగాణలో లబ్ధి పొందుతున్నారని, కానీ తెలంగాణ ప్రజల పట్ల టీటీడీ అన్యాయం చేస్తోందని గౌడ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచడంతో టీటీడీ ఆగ్రహంతో చర్యలకు సిద్ధమైంది. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on December 20, 2024 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

5 hours ago