తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
టీటీడీ చైర్మన్ ప్రకటనలో తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు ఎవరు చేసినా అనుకూలించేది లేదని పేర్కొన్నారు. తిరుమల ప్రశాంతతను కాపాడే విషయంలో పాలకమండలి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలోనే తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని హెచ్చరించినప్పటికీ, తాజాగా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని టీటీడీ అభిప్రాయపడింది. ఈ విషయంపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి స్పష్టం చేసింది.
గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను సమానంగా చూడాలని, అంతకుముందు కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రా వ్యాపారులు, పదవుల్లో ఉండే వారు తెలంగాణలో లబ్ధి పొందుతున్నారని, కానీ తెలంగాణ ప్రజల పట్ల టీటీడీ అన్యాయం చేస్తోందని గౌడ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచడంతో టీటీడీ ఆగ్రహంతో చర్యలకు సిద్ధమైంది. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on December 20, 2024 12:48 pm
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…