Political News

తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ చర్యలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

టీటీడీ చైర్మన్ ప్రకటనలో తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు ఎవరు చేసినా అనుకూలించేది లేదని పేర్కొన్నారు. తిరుమల ప్రశాంతతను కాపాడే విషయంలో పాలకమండలి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలోనే తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని హెచ్చరించినప్పటికీ, తాజాగా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని టీటీడీ అభిప్రాయపడింది. ఈ విషయంపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి స్పష్టం చేసింది.

గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను సమానంగా చూడాలని, అంతకుముందు కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా వ్యాపారులు, పదవుల్లో ఉండే వారు తెలంగాణలో లబ్ధి పొందుతున్నారని, కానీ తెలంగాణ ప్రజల పట్ల టీటీడీ అన్యాయం చేస్తోందని గౌడ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచడంతో టీటీడీ ఆగ్రహంతో చర్యలకు సిద్ధమైంది. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on December 20, 2024 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago