Political News

తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ చర్యలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

టీటీడీ చైర్మన్ ప్రకటనలో తిరుమలపై రాజకీయ వ్యాఖ్యలు ఎవరు చేసినా అనుకూలించేది లేదని పేర్కొన్నారు. తిరుమల ప్రశాంతతను కాపాడే విషయంలో పాలకమండలి నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలోనే తిరుమల వేదికగా రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని హెచ్చరించినప్పటికీ, తాజాగా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని టీటీడీ అభిప్రాయపడింది. ఈ విషయంపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి స్పష్టం చేసింది.

గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను సమానంగా చూడాలని, అంతకుముందు కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రా వ్యాపారులు, పదవుల్లో ఉండే వారు తెలంగాణలో లబ్ధి పొందుతున్నారని, కానీ తెలంగాణ ప్రజల పట్ల టీటీడీ అన్యాయం చేస్తోందని గౌడ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచడంతో టీటీడీ ఆగ్రహంతో చర్యలకు సిద్ధమైంది. ఈ పరిణామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on December 20, 2024 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

4 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

5 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

5 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

7 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

7 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

7 hours ago