తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ జరపనుంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
తనపై పెట్టిన కేసు నిలబడదని కేటీఆర్ అన్నారు. ఆ రేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం అన్నారని, అటువంటపుడు కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. అయితే, ఆ నిధుల మళ్లింపులో కేటీఆర్ హస్తం ఉందని, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమని వారు అంటున్నారు.
This post was last modified on December 20, 2024 1:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…