తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ జరపనుంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
తనపై పెట్టిన కేసు నిలబడదని కేటీఆర్ అన్నారు. ఆ రేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం అన్నారని, అటువంటపుడు కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. అయితే, ఆ నిధుల మళ్లింపులో కేటీఆర్ హస్తం ఉందని, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమని వారు అంటున్నారు.
This post was last modified on December 20, 2024 1:21 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…