Political News

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, కొన్నిసార్లు తన దూకుడుకు కళ్లెం వేయలేక అంబటి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇదే దూకుడు చూపించిన అంబటిపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. తాము ఇచ్చిన కంప్లయింట్ లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ పట్టాభిపురం పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది.

ప్రతిపక్ష హోదా లేకపోయినా, అధికార పార్టీ కాకపోయినా అంబటి మాత్రం తగ్గేదేలే అంటూ తన అనుచరులతో కలిసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రచ్చ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాలపై, పోస్టులపై తాము ఇచ్చిన ఫిర్యాదుల సంగతేంటో తేల్చాలని అంబటి పట్టుబట్టారు. ఆ ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే, విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా అంబటి వినలేదు. అంతేకాకుండా, తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని నానా రభస చేశారు. తమ విధులకు ఆటంకం కలుగిస్తున్నారని చెప్పినా అంబటి అండ్ కో వినలేదు. దీంతో, అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అంబటి ధర్నా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago