వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, కొన్నిసార్లు తన దూకుడుకు కళ్లెం వేయలేక అంబటి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇదే దూకుడు చూపించిన అంబటిపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. తాము ఇచ్చిన కంప్లయింట్ లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ పట్టాభిపురం పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది.
ప్రతిపక్ష హోదా లేకపోయినా, అధికార పార్టీ కాకపోయినా అంబటి మాత్రం తగ్గేదేలే అంటూ తన అనుచరులతో కలిసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రచ్చ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఖాతాలపై, పోస్టులపై తాము ఇచ్చిన ఫిర్యాదుల సంగతేంటో తేల్చాలని అంబటి పట్టుబట్టారు. ఆ ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా అంబటి వినలేదు. అంతేకాకుండా, తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని నానా రభస చేశారు. తమ విధులకు ఆటంకం కలుగిస్తున్నారని చెప్పినా అంబటి అండ్ కో వినలేదు. దీంతో, అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అంబటి ధర్నా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…