టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది. ఆ పేరు 2014లో పార్టీ విజయం సాధించినప్పుడూ వినిపించింది.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచాక కూడా వినిపిస్తోంది. సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వినిపించే పేర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేష్ పేర్లు మాత్రమే.. ఇప్పుడు మూడో పవర్ సెంటర్ కూడా టీడీపీలో వచ్చిందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఆ పేరుపై పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఆ పవర్ ఫుల్ వ్యక్తి పేరే కిలారి రాజేష్.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికి అందుబాటులో ఉండడం కుదరడం లేదు. ఇక అటు లోకేష్ కూడా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ నేతలు తమ దగ్గరకు వచ్చిన అంశాలతో పాటు తమకు కావాల్సిన పనుల విషయంలో కిలారు రాజేష్ను సంప్రదిస్తుండడంతో పాటు ఆయన దగ్గరకే తీసుకు వెళుతున్నారని భోగట్టా..! గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో కిలారు రాజేష్ను కూడా సీఐడీ ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మంత్రి నారా లోకేష్కు కిలారు రాజేష్ ఎంతో సన్నిహితుడిగా పేరుంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన మరింత పవర్ ఫుల్ అయిపోయారు. మంత్రి లోకేష్ సైతం తన దగ్గరకు వచ్చిన పెద్ద పెద్ద డీలింగ్స్, పనులను రాజేష్కే అప్పగిస్తున్నారని కూడా అంటున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్లోని మూడో అంతస్తు నుంచే రాజేష్ పనులు చక్క పెట్టేస్తున్నాడని భోగట్టా.. !
సహజంగానే అధికారంలో ఉన్న వారు మరో పవర్ సెంటర్ వచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు. కానీ ఇక్కడ చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా కిలారు రాజేష్ను ఎంకరేజ్ చేస్తోన్న పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. నారా లోకేష్కు చాలా అంటే చాలా సన్నిహితుడు కావడం వల్లే కిలారు రాజేష్ 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో కాని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కాని ఓ రేంజ్లో చక్రం తిప్పుతున్నారని టాక్ ?
This post was last modified on December 18, 2024 12:43 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…