Political News

టీడీపీ ఈవెంట్ లో జోగి రమేష్..లోకేష్ ఫైర్?

వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అటువంటి జోగి రమేష్ తాజాగా టీడీపీ నేత, మంత్రి పార్థసారధితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పార్ధసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతోపాటు మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. వారితో కలిసి నూజివీడు వీధుల్లో జోగి రమేష్ ర్యాలీగా తిరగడం సంచలనం రేపింది. అధికారికంగా జోగి రమేష్ టీడీపీలో చేరలేదు. అటువంటిది ఈ కార్యక్రమం, ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ నేతలు కొందరు మండిపడుతున్నారు.

గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ పై ఆల్రెడీ గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజా ఘటనతో ఫైర్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఒకవేళ జోగి రమేష్ టీడీపీలోకి వస్తానని అన్నా…చేర్చుకుంటారో లేదో తెలీదని, అటువంటిది పార్టీలో చేరకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలోనే జోగి రమేష్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. తన కుమారుడు అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు జోగి రమేష్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 16, 2024 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

17 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

57 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago