వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అటువంటి జోగి రమేష్ తాజాగా టీడీపీ నేత, మంత్రి పార్థసారధితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పార్ధసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతోపాటు మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. వారితో కలిసి నూజివీడు వీధుల్లో జోగి రమేష్ ర్యాలీగా తిరగడం సంచలనం రేపింది. అధికారికంగా జోగి రమేష్ టీడీపీలో చేరలేదు. అటువంటిది ఈ కార్యక్రమం, ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ నేతలు కొందరు మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ పై ఆల్రెడీ గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజా ఘటనతో ఫైర్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఒకవేళ జోగి రమేష్ టీడీపీలోకి వస్తానని అన్నా…చేర్చుకుంటారో లేదో తెలీదని, అటువంటిది పార్టీలో చేరకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలోనే జోగి రమేష్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. తన కుమారుడు అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు జోగి రమేష్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 16, 2024 3:21 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…