వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అటువంటి జోగి రమేష్ తాజాగా టీడీపీ నేత, మంత్రి పార్థసారధితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ నేతలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పార్ధసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతోపాటు మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. వారితో కలిసి నూజివీడు వీధుల్లో జోగి రమేష్ ర్యాలీగా తిరగడం సంచలనం రేపింది. అధికారికంగా జోగి రమేష్ టీడీపీలో చేరలేదు. అటువంటిది ఈ కార్యక్రమం, ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ నేతలు కొందరు మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ పై ఆల్రెడీ గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజా ఘటనతో ఫైర్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. ఒకవేళ జోగి రమేష్ టీడీపీలోకి వస్తానని అన్నా…చేర్చుకుంటారో లేదో తెలీదని, అటువంటిది పార్టీలో చేరకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలోనే జోగి రమేష్ ను వైసీపీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. తన కుమారుడు అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు జోగి రమేష్ దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 16, 2024 3:21 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…