Political News

వారిని కూడా ఆప‌లేకపోతే ఎలా!

ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నుంచి వెళ్లిపోతున్న‌వారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అడ్డుకోలేదు. వారికి ఎక్క‌డా.. బ్రేకులు వేయ‌లేదు. క‌నీసం చ‌ర్చించ‌నూ లేదు. దీంతో చాలా మంది నాయ‌కులు పార్టీకి జ‌ల్ల కొట్టి జంప్ చేసేశారు. వీరిలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు సొంత జిల్లాలోనే పెద్ద కుంప‌టి రాజుకుంటోంది. వైసీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ, బీజేపీ పోటీ ప‌డుతున్నాయి.

ఇది ప‌క్కా వాస్త‌వం. ప్ర‌స్తుతం క‌డ‌ప కార్పొరేష‌న్ ప‌రిధిలో వైసీపీనే రాజ్యం చేస్తోంది. ఇక్క‌డ గుండుగుత్త‌గా .. వైసీపీకి చెందిన కార్పొరేట‌ర్లే ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరిలో స‌గం మందిని తీసుకుని.. క‌డ‌ప కార్పొరేష‌న్‌పై ఆధిప‌త్యం సాధించాల‌ని టీడీపీ నేత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీనికి చంద్ర‌బాబు ఆదేశా లు ఉన్నాయా? లేవా? లోక‌ల్ నాయ‌కులే ఇలా చేస్తున్నారా? అంటే.. విష‌యం ఏదైనా కూడా.. మొత్తానికి ఇక్క‌డి వారు మార్పు దిశ‌గా అడుగులు వేయ‌డం క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే స‌గం మంది కార్పొరేట‌ర్లు కండువాలు మార్చుకునేందుకు రెడీ అయ్యారు. వీరిలోనూ ఏడుగురు నేడో రేపో సైకిల్ ఎక్క‌నున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి స‌మయంలో మ‌రోవైపు.. బీజేపీ నేత‌లు కూడామి గిలిన వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక్క‌డ కాన్సెప్టు ఒక్క‌టే. ఎవ‌రు ఏ పార్టీలోకి వ‌చ్చార‌న్న‌ది ముఖ్యం కాదు. కార్పొరేష‌న్‌ను కూట‌మి కైవ‌సం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్టుగా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ అలెర్ట్ అయితే అయింది.

ఎంపీ అవినాష్ రెడ్డి త‌మ పార్టీ కార్పొరేట‌ర్ల‌తో ర‌హ‌స్యంగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. కానీ, ఎక్క‌డా ఆయ‌న చ‌ర్చ‌లు ఫలించ‌డం లేదు. జ‌గ‌న్ వ‌చ్చి త‌మ‌కు హామీ ఇస్తే త‌ప్ప‌.. త‌మ నిర్ణ‌యం మార్చుకోబోమ ని చాలా మంది తేల్చి చెబుతున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి త‌మ‌కు ఇంకా సొమ్ములు రావాల్సి ఉంద‌ని.. పార్టీ మారితే ఇచ్చేందుకు ప్ర‌భుత్వం కూడా రెడీ అవుతోంద‌ని వారు చెబుతున్న‌ట్టు తెలిసింది.

వీరిని స‌ర్దు బాటు చేయ‌లేక అవినాష్‌రెడ్డి ఆప‌శోపాలు ప‌డుతున్నారు. మ‌రోవైపు సాగునీటి సంఘాల ఎన్నిక‌ల‌ను కూడా.. అవినాష్‌రెడ్డికే అప్ప‌గించిన జ‌గ‌న్‌.. తాను బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు. ఫ‌లితంగా పులివెందుల‌లో సాగునీటి సంఘాలు అన్నీ కూట‌మికే ద‌క్కాయి. మ‌రి ఇప్పుడైనా.. జ‌గ‌న్ స్పందించి.. కార్పొరేట‌ర్ల‌కు అభ‌యం ఇస్తారో లేదో చూడాలి.

This post was last modified on December 15, 2024 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

24 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

30 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

45 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

1 hour ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago