జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేయడం ఆనవాయితీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు గీసి పందేలు వేశారు.
కానీ, ఇప్పుడు సొంత పార్టీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో మరింతగా రెచ్చిపోవాలని భావించిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు రోజులుగా ఇక్కడ వర్మ అనుచరులను పోలీసులు ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తున్నట్టు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. బరులు వేయడానికి వీల్లేదని.. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని.. ఇక్కడ పందేలు వేయొద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయని వారు తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు.. ఎవరైనా సాహసించి బరులు గీస్తే.. అరెస్టులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. దీంతో అనుచరులు ఇప్పుడు వర్మ ఇంటికి క్యూ కడుతున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న వర్మ.. తాను త్వరలోనే వస్తానని.. మీరు అధైర్య పడవద్దని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు.. జనసేన నాయకులు కూడా.. బరులు గీస్తే.. చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎస్పీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో వర్మ వర్గం డోలాయమానంలో పడింది. ఇప్పటి వరకు తమదే పైచేయిగా ఉందని.. ఇప్పుడు అనూహ్యంగా తమకు బ్రేకులు వేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో బహిరంగ వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఒకటి రెండు బరులైనా ఏర్పాటుచేసుకునేలా అనుమతులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు బలంగా ఉండడంతో వర్మ కూడా మౌనంగా ఉన్నారని సమాచారం. మరి సంక్రాంతి నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2024 3:12 pm
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…