జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేయడం ఆనవాయితీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు గీసి పందేలు వేశారు.
కానీ, ఇప్పుడు సొంత పార్టీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో మరింతగా రెచ్చిపోవాలని భావించిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు రోజులుగా ఇక్కడ వర్మ అనుచరులను పోలీసులు ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తున్నట్టు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. బరులు వేయడానికి వీల్లేదని.. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని.. ఇక్కడ పందేలు వేయొద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయని వారు తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు.. ఎవరైనా సాహసించి బరులు గీస్తే.. అరెస్టులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. దీంతో అనుచరులు ఇప్పుడు వర్మ ఇంటికి క్యూ కడుతున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న వర్మ.. తాను త్వరలోనే వస్తానని.. మీరు అధైర్య పడవద్దని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు.. జనసేన నాయకులు కూడా.. బరులు గీస్తే.. చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎస్పీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో వర్మ వర్గం డోలాయమానంలో పడింది. ఇప్పటి వరకు తమదే పైచేయిగా ఉందని.. ఇప్పుడు అనూహ్యంగా తమకు బ్రేకులు వేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో బహిరంగ వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఒకటి రెండు బరులైనా ఏర్పాటుచేసుకునేలా అనుమతులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు బలంగా ఉండడంతో వర్మ కూడా మౌనంగా ఉన్నారని సమాచారం. మరి సంక్రాంతి నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2024 3:12 pm
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…