జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్వీఎస్ ఎస్ వర్మకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆయన అనుచరులకు తీవ్ర పరాభవం జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే నెల సంక్రాంతిని పురస్కరించుకుని పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు వేయడం ఆనవాయితీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. వర్మ అనుచరులు పెద్ద ఎత్తున బరులు గీసి పందేలు వేశారు.
కానీ, ఇప్పుడు సొంత పార్టీ టీడీపీ కూటమి అధికారంలో ఉంది. దీంతో మరింతగా రెచ్చిపోవాలని భావించిన వర్మ అనుచరులకు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. రెండు రోజులుగా ఇక్కడ వర్మ అనుచరులను పోలీసులు ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తున్నట్టు నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. బరులు వేయడానికి వీల్లేదని.. ఇది డిప్యూటీ సీఎం నియోజకవర్గమని.. ఇక్కడ పందేలు వేయొద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయని వారు తేల్చి చెబుతున్నారు.
అంతేకాదు.. ఎవరైనా సాహసించి బరులు గీస్తే.. అరెస్టులు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. దీంతో అనుచరులు ఇప్పుడు వర్మ ఇంటికి క్యూ కడుతున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న వర్మ.. తాను త్వరలోనే వస్తానని.. మీరు అధైర్య పడవద్దని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు.. జనసేన నాయకులు కూడా.. బరులు గీస్తే.. చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎస్పీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో వర్మ వర్గం డోలాయమానంలో పడింది. ఇప్పటి వరకు తమదే పైచేయిగా ఉందని.. ఇప్పుడు అనూహ్యంగా తమకు బ్రేకులు వేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో బహిరంగ వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఒకటి రెండు బరులైనా ఏర్పాటుచేసుకునేలా అనుమతులు ఇప్పించాలని వారు కోరుతున్నారు. కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకుంటే.. ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు బలంగా ఉండడంతో వర్మ కూడా మౌనంగా ఉన్నారని సమాచారం. మరి సంక్రాంతి నాటికి ఏం జరుగుతుందో చూడాలి.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…