ఒక దేశం.. ఒక ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికల అంశంపై చర్చకు తెర తీసిన మోడీ సర్కారు.. ఇప్పుడా అంశాన్ని వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికతో పాటు.. రాష్ట్రాలకు నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకేసారి జరిపేందుకు వీలుగా సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన చట్టపరమైన చర్యలకు వీలుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపటంతో.. అతి త్వరలో పార్లమెంటులో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టే వీలుంది.
జమిలి ఎన్నికలకు అవసరమైన రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదిస్తే జమిలి ఎన్నికల వ్యవహారం చట్టబద్ధమవుతుంది. అయితే.. రెండు బిల్లుల్లో మొదటి బిల్లుకు లోక్ సభ.. రాజ్యసభల్లో మూడింతల్లో రెండింతల మెజార్టీ అవసరమవుతుంది. ప్రస్తుతానికి లోక్ సభ..అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే అంశాన్ని పక్కన పెడుతున్నారు. దీనికి కారణం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం పలకాల్సి ఉంది. అందుకే.. ఆ విషయంలో దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక.. జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ స్పందించింది. బిల్లులను చూసిన తర్వాత స్పందిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో దేశంలో జమిలి ఎన్నికలకు మించిన పెద్ద సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఎన్ని? వ్యతిరేకించే పార్టీలు ఏంటి? స్పందించని పార్టీలేవి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఎందుకుంటే.. పలు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తూ అధికారాన్ని షేర్ చేసుకుంటున్న పలు రాజకీయ పార్టీలు సైతం జమిలిపై ఇప్పటివరకు స్పందించలేదు. పార్టీల వారీగా చూస్తే..
మద్దతు ఇచ్చిన పార్టీలు ఏవంటే..
This post was last modified on December 13, 2024 9:39 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…