Political News

బొత్స‌కు సెగ‌.. వైసీపీలో ఒక్కొక్క‌రిదీ ఒక్కొక్క దారి ..!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సొంత పార్టీలోనే సెగ‌లు పుడుతున్నాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు ఆయ‌న వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డి నాయ‌కుల‌ను లైన్‌లో పెట్ట‌డం.. వివాదాల‌కు దారి లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేవారిని క‌ట్ట‌డి చేయ‌డం ఇప్పుడు బొత్స‌కు ఉన్న‌ప్ర‌ధాన బాధ్య‌త‌. అయితే.. ఈ బాధ్య‌త‌ల మాట ఎలా ఉన్నా.. స్థానికంగా ఉన్న నాయ‌కుల వ్య‌వ‌హార శైలి మాత్రం బొత్స‌కు భారంగా ఉంది. రెండు రోజుల కింద‌ట స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌లు నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌.. నిర‌స‌న‌ల్లో అంద‌రూ పాల్గొనాల‌ని ఆయ‌న సూచించారు. ఈ క్ర‌మంలో అంద‌రూ పాల్గొనేలా వారిని దిశానిర్దేశం చేసేందుకు ఆయా జిల్లాల ఇంచార్జ్‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బొత్స ఉభ‌య గోదావ‌రి జిల్లాల నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. కూట‌మి స‌ర్కారు అవ‌లంభిస్తున్న విధానాలు ఆయ‌న వివ‌రించారు. ప్ర‌భుత్వం పై పోరాడేందుకు.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా రావాల‌ని పిలుపునిచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఈ స‌మావేశంలోనే ద్వితీయ శ్రేణి నాయ‌కులు నిప్పులు చెరిగారు.

ఎన్నిక‌ల‌కు ముందు.. త‌మ నుంచి తీసుకున్న సొమ్ముల‌ను తిరిగి ఇప్పించాల‌ని వారు కోర‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వైసీపీ నాయ‌కులు మండ‌ల‌స్థాయిలో ఖ‌ర్చుల‌ను స్థానిక నాయ‌కుల‌పై పెట్టారు. ముందు మీరు ఖ‌ర్చు పెట్టండి త‌ర్వాత ఇస్తామ‌న్నారు. కానీ, వారు ఓడిపోవ‌డంతో అంద‌రూ మొహం చాటేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు నాయ‌కులు మాత్ర‌మే అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. త‌ర్వాత చూద్దామ‌ని న‌చ్చ‌జెప్పారు. కానీ, మిగిలిన వారు మాత్రం అస‌లు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించిన నాయ‌కులు ముందు త‌మ సొమ్ముల సంగ‌తి తేల్చాల‌ని నిల‌దీశారు. దీనికి బొత్స నివ్వెర పోయారు. ఈ స‌మస్య‌ను తాను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. మ‌రోవైపు తూర్పుగోదావ‌రికి చెందిన‌ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒక‌రు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్టారు. ఆయ‌న కుమారుడు ఓ కేసులో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగా త‌న‌కు ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని.. ఆయ‌న అప్ప‌ట్లోనే ఆరోపించారు. ఇక‌, అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన స‌మావేశానికి కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు.

దీంతో బొత్స ఆయ‌న‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లించ‌లేదు. దీంతో ముక్త‌స‌రిగా మాట్లాడి ముగించారు. ఈ ప‌రిణామాల‌తో బొత్స త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇదే ప‌రిస్థితి మున్ముందు కూడా కొన‌సాగితే.. స‌రిదిద్ద‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి. పైగా.. గోదావ‌రి జిల్లాల నాయ‌కుల వ్యూహాల‌కు.. బొత్స ఆలోచ‌న‌ల‌కు స‌రిపోయే ప‌రిస్థితి లేద‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

This post was last modified on December 12, 2024 8:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

3 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

3 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

3 hours ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

6 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

7 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

7 hours ago