వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 ఇంకా చాలా దూరంలో ఉంది కానీ బాక్సాఫీస్ పోటీ మాత్రం మహా రంజుగా మారిపోతోంది. నిన్న ‘అఖండ 2 తాండవం’ విడుదల తేదీ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కావడం ఆలస్యం ఇప్పుడు అదే డేట్ కి ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే బాలకృష్ణ వర్సెస్ సాయి దుర్గ తేజ్ అన్నమాట. అయితే ఈ కాంపిటేషన్ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే రెండింట్లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. హిందుత్వం, దైవశక్తి, రాక్షస గణం, అద్భుత లీలలు ఇవన్నీ పుష్కలంగా దట్టించుకున్నాయి. రెండూ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు.
సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో భారీ బడ్జెట్ తో తీస్తోంది. రామ్ చరణ్ అతిథిగా లాంచ్ చేసిన ట్రైలర్ చూస్తే ఒక మానవాతీత శక్తిని ఎదురుకోవడానికి సామాన్యుడు చేసే పోరాటం ఎంతటి రక్తపాతానికి దారి తీస్తుందో అనే పాయింట్ మీద రూపొందించినట్టు కనిపిస్తోంది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సిక్స్ ప్యాక్ బాడీతో సాయి ధరమ్ తేజ్ ఫెరోషియస్ గా ఉన్నాడు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంకేతిక వర్గం పనితనం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. శ్రీకాంత్, సాయికుమార్, జగపతిబాబు వాయిస్ ఓవర్లో నేపథ్యం వినిపించారు.
ఇక అఖండ 2 తాండవం గురించి కొంత తెలిసిందే. మొదటి భాగంలో సెకండాఫ్ కే పరిమితమైన అఘోరా పాత్ర ఈసారి పూర్తి విశ్వరూపం చూపించబోతోంది. తమన్ బీజీఎమ్ మీద అంచనాలు ఆల్రెడీ పీక్స్ లో ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శీను మరింత శక్తివంతంగా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దినట్టు యూనిట్ టాక్. సో కాంపిటీషన్ మాత్రం మహా రంజుగా ఉండేలా ఉంది. అఖండ 2 తాండవం, సంబరాల ఏటికెట్టు రెండూ సెప్టెంబర్ 25 అని చెప్పాయి కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మాట మీద ఉంటారా అంటే ఏమో చెప్పలేం. ఇంకా పది నెలల సమయముందిగా. చూద్దాం.
This post was last modified on December 12, 2024 9:45 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…