వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 ఇంకా చాలా దూరంలో ఉంది కానీ బాక్సాఫీస్ పోటీ మాత్రం మహా రంజుగా మారిపోతోంది. నిన్న ‘అఖండ 2 తాండవం’ విడుదల తేదీ ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కావడం ఆలస్యం ఇప్పుడు అదే డేట్ కి ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే బాలకృష్ణ వర్సెస్ సాయి దుర్గ తేజ్ అన్నమాట. అయితే ఈ కాంపిటేషన్ ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే రెండింట్లో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. హిందుత్వం, దైవశక్తి, రాక్షస గణం, అద్భుత లీలలు ఇవన్నీ పుష్కలంగా దట్టించుకున్నాయి. రెండూ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు.
సంబరాల ఏటిగట్టుని హనుమాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో భారీ బడ్జెట్ తో తీస్తోంది. రామ్ చరణ్ అతిథిగా లాంచ్ చేసిన ట్రైలర్ చూస్తే ఒక మానవాతీత శక్తిని ఎదురుకోవడానికి సామాన్యుడు చేసే పోరాటం ఎంతటి రక్తపాతానికి దారి తీస్తుందో అనే పాయింట్ మీద రూపొందించినట్టు కనిపిస్తోంది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సిక్స్ ప్యాక్ బాడీతో సాయి ధరమ్ తేజ్ ఫెరోషియస్ గా ఉన్నాడు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంకేతిక వర్గం పనితనం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. శ్రీకాంత్, సాయికుమార్, జగపతిబాబు వాయిస్ ఓవర్లో నేపథ్యం వినిపించారు.
ఇక అఖండ 2 తాండవం గురించి కొంత తెలిసిందే. మొదటి భాగంలో సెకండాఫ్ కే పరిమితమైన అఘోరా పాత్ర ఈసారి పూర్తి విశ్వరూపం చూపించబోతోంది. తమన్ బీజీఎమ్ మీద అంచనాలు ఆల్రెడీ పీక్స్ లో ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శీను మరింత శక్తివంతంగా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దినట్టు యూనిట్ టాక్. సో కాంపిటీషన్ మాత్రం మహా రంజుగా ఉండేలా ఉంది. అఖండ 2 తాండవం, సంబరాల ఏటికెట్టు రెండూ సెప్టెంబర్ 25 అని చెప్పాయి కానీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా మాట మీద ఉంటారా అంటే ఏమో చెప్పలేం. ఇంకా పది నెలల సమయముందిగా. చూద్దాం.
This post was last modified on December 12, 2024 9:45 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…