బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయంగా అగ్గి రాజేశారు. ‘కుక్కులు కూడా మీకు ఓటేయవు’ అంటూ.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నాయకులపై ఆయన నోరు చేసుకున్నారు. తాజాగా ‘తెలంగాణ తల్లి’ విగ్రహం రేపిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవితలు.. కాంగ్రెస్ సహా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని వారు దుయ్యబట్టారు. ఉద్యమం జరిగినప్పుడు ఏ తల్లి విగ్రహాన్ని అనుకున్నామో ఆ విగ్రహమే తెలంగాణ తల్లి అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలను తరిమితరిమి కొడతామని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బీజేపీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్.. సంచలన వ్యాఖ్యలు చేసి.. రాజకీయ రగడకు కేంద్రంగా మారారు. “బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కుక్కలు కూడా ఓటేయవు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, కవితలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. కనీసం డిపాజిట్టు కూడా దక్కదన్నారు. కేటీఆర్ ఇప్పుడు ‘కేవలం ఒక ఎమ్మెల్యే’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆయన వల్ల ఏమీ జరగదని తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో ఎదుగుతోందని, బీజేపీ ప్రాభవాన్ని ఎవరూ తగ్గించలేరని చెప్పారు.
విగ్రహం ఏర్పాటుతో కాంగ్రెస్-బీఆర్ఎస్ లు రాజకీయాలు చేస్తున్నాయని.. అరవింద్ అన్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్గా తన ముద్రను ఎవరూ తుడిచేయలేరన్న అరవింద్.. తన రాజకీయాలను ఎవరూ శాసించలేరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు రాజకీయాలు ఎలా చేయాలో తెలుసునని చెప్పారు. “నా బండి నా చేతిలోనే ఉంది. నన్ను ఎవరూ డిక్టేట్ చేయలేరు. చేయాలని అనుకుననా అది అసాధ్యం. సమయాన్ని బట్టి నా బండికి నేనే గేర్ మారుస్తా. అప్పుడే స్పీడ్ మారుతుంది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. గత కొన్నాళ్లుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో అరవింద్ విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
This post was last modified on December 11, 2024 9:39 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…