Political News

వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. ఈసారైనా ?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై చాలా కాలంగా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయితే ప్రతీసారి ఏదో ఒక కారణంగా దీనిపై కేంద్రం రిస్క్ తీసుకోలేకపోతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) గురించి చర్చ నెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనతో బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

గతంలో మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం బిల్లుకు రూపకల్పన చేసింది. ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించగా, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమిలి ఎన్నికల బిల్లుకు పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కానీ, లోక్‌సభలో 364 సీట్లు, రాజ్యసభలో 164 సీట్లు సాధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం దాన్ని సాధ్యం కాకుండా చేస్తోంది.

అందువల్లే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి విస్తృత చర్చలు చేపట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జమిలి ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ, విభిన్న పార్టీలను ఏకాభిప్రాయానికి రప్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. మరోవైపు, బీఎస్పీ జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతుండగా, ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదని బిల్లు పార్లమెంట్‌లో ముందుకు సాగదని పేర్కొంటోంది.

కానీ బిల్లును పరిచయం చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అన్ని పార్టీలను సంప్రదించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంతో, జమిలి బిల్లుకు సంబంధించిన చర్చ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ బిల్లు పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ మిన్నంటుతోంది. బిల్లును ప్రవేశపెట్టడమేనా, లేక విస్తృత చర్చల కోసం వెనక్కి తీసుకుంటారా అన్నది కేంద్రం తీర్పుపై ఆధారపడి ఉంది.

This post was last modified on December 10, 2024 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

13 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

15 hours ago