ఏపీలో మహిళలంతా ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు గురించి ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలని ఆయన ప్రకటన చేశారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ హామీ అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని యార్లగడ్డ చెప్పారు. అంతేకాదు, ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన విధివిధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని వెల్లడించారు. యార్లగడ్డ ప్రకటనతో ఏపీలోని మహిళలంతా ముందుగానే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు జనంలోకి బాగా దూసుకువెళ్లాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సూపర్ 6లోని పథకాలను అమలు చేస్తూ వస్తోంది. కానీ, ఏపీలో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన మహిళలు ఆశగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇంకా అమలుకాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఆగస్టు 15, దీపావళి అంటూ ఆ పథకం వాయిదా పడుతూ ఉండడంతో మహిళలు కాస్త అసహనంగా ఉన్నారు. అయితే, తెలంగాణతో పాటు కర్ణాటకలో అమలువుతున్న ఈ పథకంలోని లోపాలను సవరించి పకడ్బందీగా అమలు చేసేందుకే సమయం తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే ఈ హామీ అమలుపై యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతాలలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
This post was last modified on December 10, 2024 10:11 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…