దేశమంతా పుష్ప మేనియాతో ఊగిపోతోన్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ రాజేసిన వైల్డ్ ఫైర్ సినీ అభిమానులు మొదలు రాజకీయ నాయకుల వరకు పాకింది. ఎక్కడ చూసినా అస్సలు తగ్గేదేలే…రప్ప రప్ప…అంటూ పుష్ప మేనరిజాన్ని, డైలాగులను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. త్వరలో జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పుష్పను ఆప్, బీజేపీ నేతలు పోటాపోటీగా వాడిపడేశారు.
రాబోయే ఎన్నికల్లో ఆప్ జాతీయాధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం తగ్గేదేలే అంటూ ఆప్ నేతలు ఓ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఇరికించినా అస్సలు తగ్గేదేలే అని, రాబోయే ఎన్నికల్లో ఆప్ అన్ని సీట్లు ఊడ్చిపడేయడం ఖాయమని కేజ్రీవాల్ 4 అంటూ ఆయన చీపురు పట్టుకున్న పోస్టర్ ను ఆప్ నేతలు ప్రచారం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని కాన్ఫిడెంట్ గా ఆప్ నేతలు ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక, ఆప్ నేతలకు ఏ మాత్రం తగ్గని బీజేపీ నేతలు రప్ప రప్ప అంటూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పుష్పగాడిలా కుర్చీలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సచ్ దేవ్ పోస్టర్లు ఢిల్లీలోని గల్లీగల్లీలో అంటించారు బీజేపీ నేతలు. 1998 తర్వాత ఢిల్లీ గద్దె మీద బీజేపీ కూర్చోలేదు. దీంతో, ఈ సారి ఎలాగైనా గెలవాలని కాషాయ దళం కంకణం కట్టుకుంది. ఈ రెండు పార్టీల పోస్టర్ వార్ తో ఎముకలు గడ్డకట్టే చలిలోనూ ఢిల్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…