వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం దాదాపు పదేళ్లుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ జర్మనీ పౌరుడని, తప్పుడు డాక్యుమెంట్లతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో భారతీయ పౌరుడినని కేసును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తంలో రూ. 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, మరో 5 లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి కావాలని రమేష్ ను కోర్టు ఆదేశించింది. 2009లో తప్పుడు ధృవపత్రాలతో చెన్నమనేని రమేష్ గెలిచారని ఆనాడు ఆయన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత, ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.
రమేశ్కు జర్మనీ పౌరసత్వం ఉందని, తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేశారని వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం 2017లో రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత రమేశ్ హైకోర్టును ఆశ్రయించినా కేంద్రం నిర్ణయం మారలేదు. ఆ తర్వాత మరోసారి కేంద్రం నిర్ణయంపై రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
ఆ తర్వాత జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు రమేశ్ మెమో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పదేళ్లుగా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే విచారణ నేడు పూర్తి కాగా…రమేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్డు కొట్టివేసింది. రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పునిచ్చింది.
This post was last modified on December 9, 2024 3:46 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…