Political News

BRS మాజీ ఎమ్మెల్యే జర్మనీ పౌరడు, 30 లక్షల జరిమానా

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం దాదాపు పదేళ్లుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ జర్మనీ పౌరుడని, తప్పుడు డాక్యుమెంట్లతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో భారతీయ పౌరుడినని కేసును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తంలో రూ. 25 లక్షలను ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని, మరో 5 లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని సూచించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి కావాలని రమేష్ ను కోర్టు ఆదేశించింది. 2009లో తప్పుడు ధృవపత్రాలతో చెన్నమనేని రమేష్ గెలిచారని ఆనాడు ఆయన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత, ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.

రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని, తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేశారని వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం 2017లో రమేశ్‌ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత రమేశ్ హైకోర్టును ఆశ్రయించినా కేంద్రం నిర్ణయం మారలేదు. ఆ తర్వాత మరోసారి కేంద్రం నిర్ణయంపై రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.

ఆ తర్వాత జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు రమేశ్ మెమో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పదేళ్లుగా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే విచారణ నేడు పూర్తి కాగా…రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్డు కొట్టివేసింది. రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తీర్పునిచ్చింది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago