Political News

లీజుకు తీసుకుని సొమ్ములు ఎగ్గొట్టిన వైసీపీ నేత‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రికి భారీ దెబ్బే త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు గ్రామాల‌కు చెందిన 150 మందికి పైగా రైతులు ఆదివారం ఆయ‌న ఇంటి ముందు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వంటా వార్పు పేరుతో ఆయ‌న ఇంటి ముందే.. పొయ్యిలు వెలిగించి.. వంట‌లు చేసి నిర‌సన తెలిపారు. దీంతో వైసీపీ నాయ‌కులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. అయితే.. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేత‌ల‌ను అక్క‌డ నుంచి పంపించేశారు.

ఏం జ‌రిగింది?

అబ్బ‌య్య చౌద‌రి 2019 ఎన్నిక‌ల్లో తొలిసారి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కొల్లేరు స‌ర‌స్సు కొంత భాగం ఉంటుంది. దీనిలో చేప‌ల చెరువులు ఉన్నాయి. స్థానిక శ్రీప‌ర్రు గ్రామానికి చెందిన రైతుల నుంచి చెరువులు లీజుకు తీసుకున్నారు. వాటిలో చేప‌లు, రొయ్య‌లు సాగు చేశారు. భారీగానే గ‌డించార‌ని రైతులు చెబుతున్నారు. అయితే.. లీజుల‌కు సంబంధించి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి సొమ్ములు చెల్లించాల్సి ఉంది.

కానీ, అబ్బ‌య్య చౌద‌రి త‌మ‌కు రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని, అదేమ‌ని అడిగితే.. అక్ర‌మకేసులు పెట్టించి వేధించార‌ని రైతులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అధికారం మార‌డంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి సాయంతో అబ్బ‌య్య ను క‌లుసుకుని త‌మ సొమ్ములు వ‌సూలు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించా మన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌ప్పించుకుని తిరుగుతున్న నేప‌థ్యంలో నిర‌స‌న తెలిపేందుకువ చ్చిన‌ట్టు పేర్కొన్నారు. త‌మ‌ను వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే ఎక్క‌డ‌?

త‌న ఇంటి ముందుకు రైతులు ఆందోళ‌న‌కు దిగినా.. మాజీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి మాత్రం స్పందిం చలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న లండ‌న్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని.. వ‌చ్చిన త‌ర్వాత‌సెటిల్ చేస్తార‌ని అబ్బ‌య్య చౌద‌రి త‌ర‌ఫున ఆయ‌న అనుచ‌రులు చెప్పారు. ఇంటి ముందు వంటా వార్పు చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు. దీంతో ఇరు ప‌క్షాల వాగ్వాదం చోటు చేసుకుంది. రంగప్ర‌వేశం చేసిన పోలీసులు.. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌కు అండ‌గా నిలిచారు. వైసీపీ నాయ‌కుల‌ను అక్క‌డ నుంచి పంపించేశారు.

This post was last modified on December 9, 2024 6:08 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

56 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

1 hour ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

6 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago