పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి భారీ దెబ్బే తగిలింది. నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 150 మందికి పైగా రైతులు ఆదివారం ఆయన ఇంటి ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వంటా వార్పు పేరుతో ఆయన ఇంటి ముందే.. పొయ్యిలు వెలిగించి.. వంటలు చేసి నిరసన తెలిపారు. దీంతో వైసీపీ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే.. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేతలను అక్కడ నుంచి పంపించేశారు.
ఏం జరిగింది?
అబ్బయ్య చౌదరి 2019 ఎన్నికల్లో తొలిసారి దెందులూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కొల్లేరు సరస్సు కొంత భాగం ఉంటుంది. దీనిలో చేపల చెరువులు ఉన్నాయి. స్థానిక శ్రీపర్రు గ్రామానికి చెందిన రైతుల నుంచి చెరువులు లీజుకు తీసుకున్నారు. వాటిలో చేపలు, రొయ్యలు సాగు చేశారు. భారీగానే గడించారని రైతులు చెబుతున్నారు. అయితే.. లీజులకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి సొమ్ములు చెల్లించాల్సి ఉంది.
కానీ, అబ్బయ్య చౌదరి తమకు రూపాయి కూడా ఇవ్వలేదని, అదేమని అడిగితే.. అక్రమకేసులు పెట్టించి వేధించారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారం మారడంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సాయంతో అబ్బయ్య ను కలుసుకుని తమ సొమ్ములు వసూలు చేసుకునేందుకు ప్రయత్నించా మన్నారు. అయినప్పటికీ.. ఆయన తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో నిరసన తెలిపేందుకువ చ్చినట్టు పేర్కొన్నారు. తమను వైసీపీ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే ఎక్కడ?
తన ఇంటి ముందుకు రైతులు ఆందోళనకు దిగినా.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాత్రం స్పందిం చలేదు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారని.. త్వరలోనే వస్తారని.. వచ్చిన తర్వాతసెటిల్ చేస్తారని అబ్బయ్య చౌదరి తరఫున ఆయన అనుచరులు చెప్పారు. ఇంటి ముందు వంటా వార్పు చేయడం ఏంటని నిలదీశారు. దీంతో ఇరు పక్షాల వాగ్వాదం చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులకు అండగా నిలిచారు. వైసీపీ నాయకులను అక్కడ నుంచి పంపించేశారు.
This post was last modified on December 9, 2024 6:08 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…