ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆరు మాసాల్లోనే వ్యతిరేకత వచ్చిందన్నది వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ చెబుతున్న మాట. కానీ, ఆరుమాసాల్లోనే అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని.. సూపర్ సిక్స్లో కొన్ని పథకాలను అమలు చేశామని.. సర్కారు చెబుతున్న మాట. దీంతో అసలు జగన్ చెబుతున్న విషయం ఏ లెక్కల్లో ఉందన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం అయినా.. గతంలో అయినా.. జగన్ సంక్షేమ పథకాలు అందించడమే పాలనగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పథకాల ను వెనువెంటనే అమలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే.. పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయంపై మాత్రం సీఎం చంద్రబాబు కూపీ లాగుతున్నారు. ఐవీఆర్ సర్వే ద్వారా ఆయన ప్రజల నాడిని తెలుసు కునే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని పథకాలను అమలు చేస్తూ.. మరికొన్నింటిని వాయిదా వేస్తున్నారు. కానీ, జగన్ మాత్రం అన్ని పథకాలూ తొలి ఆరుమాసాల్లోనే అమలు చేయాలన్న వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, ఇది ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఇక, మరో విషయం.. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నది. దీనికి ప్రస్తుతానికైతే.. ఎక్కడా ప్రాతిపదిక కనిపించడం లేదు. ఎందుకంటే.. కీలకమైన పింఛన్లను పెంచడం ద్వారా.. పట్టణ, నగర, గ్రామీణ స్థాయిలో కూటమి సర్కారుకు గ్రాఫ్ పెరిగిందే కానీ, తగ్గలేదు.
ఇక, గ్యాస్ సిలిండిర్ల పంపిణీ పథకం కూడా… కూటమి సర్కారుకు మేలు చేసిందనే చెప్పాలి. అదేసమయంలో అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక వంటివి ప్రజలకు చేరువయ్యాయి. దీంతో జగన్ చెబుతున్న లెక్కల్లో లాజిక్ కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా కనిపించడం లేదని అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. జగన్ చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని అంటున్నారు.
This post was last modified on December 9, 2024 10:39 am
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…