Political News

ధ‌ర్మాన డుమ్మా.. వైసీపీకి గుడ్ బై ఖాయం.. !

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. వైసీపీకి గుడ్ బై చెప్ప‌డం దాదాపు ఖ‌రారైంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయ‌కు ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మావేశం పెట్టినా.. ఆయ‌న రాలేదు. ఆయ‌న కుమారుడిని కూడా పంపించ లేదు. ఈ క్ర‌మంలోనే ధర్మాన వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు. గుర్రాన్ని నీటి వ‌ర‌కు మాత్ర‌మే తీసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని.. నీళ్లు తాగించ‌లేమ‌ని అన్నారు. అంటే.. ధ‌ర్మాన‌కు శ్రీకాకుళం జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించినా.. ఆయ‌న తీసుకునేందుకు సిద్ధంగా లేర‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గానే తీసుకున్నారు.

అలాగ‌ని బ్ర‌తిమాలే దృక్ఫ‌థంమాత్రం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ధ‌ర్మాన ఎందుకు వైసీపీని వీడాల‌ని అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న కూడా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. ఉత్త‌రాంధ్ర ప‌గ్గాల‌ను వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. అయితే.. ఈ నియామ‌కాన్ని ధ‌ర్మాన అడ్డుకున్నా రు. ఆయ‌న ను వ‌ద్ద‌ని చెప్పారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ విష‌యంపై ఆయ‌న కామెంట్లు కూడా చేశారు. కానీ, జ‌గ‌న్ మాత్రం వినిపించుకోలేదు. త‌ర్వాత‌.. కాలంలో ధ‌ర్మాన వైవీల మ‌ధ్య వివాదాలు కూడా వ‌చ్చాయి.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో భూములు దోచుకునేందుకు వైవీ వ‌చ్చారంటూ.. అనుచరుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ధ‌ర్మాన చెప్పుకొచ్చారు. దీనిపై అంత‌ర్గ‌తంగా పార్టీలోనూ చ‌ర్చ జ‌రిగింది. అంటే.. వైవీని త‌న‌కు వ్య‌తిరేకంగా నియ‌మించార‌ని.. ఉత్త‌రాంధ్ర‌లో త‌న‌ను, త‌న రాజ‌కీయాల‌ను అడ్డుకునేందుకు వైవీని పంపించార‌న్న వాద‌న ధ‌ర్మాన వ‌ర్గంలో వినిపించింది. దీనికి తోడు.. ఎన్నిక‌ల్లోత‌న కుమారుడికి టికెట్ ఆశించారు. దీనికి జ‌గ‌న్ అంగీక‌రించ‌లేదు.

ఇక‌, పార్టీ ప‌రంగా గుత్తాధిప‌త్యాన్ని కోరుకున్న మాట కూడా.. వాస్త‌వ‌మే. కానీ, జిల్లాపై అజ‌మాయిషీని జ‌గ‌న్ ఆయ‌న‌కు అప్ప‌గించ‌లేదు. ఈ ప‌రిణామాల‌తోనే ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నార‌న్న‌ది రాజ‌కీయం గా జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనిని ఇటు పార్టీ కానీ అటు ధ‌ర్మాన కానీ. నిర్ధారించ‌డం లేదు. ఏదో గ్యాప్ అయితేఉంది. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని, సంక్రాంతి త‌ర్వాత‌.. చేరిక‌లు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రిఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on December 8, 2024 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

10 minutes ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

38 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

1 hour ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

2 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

2 hours ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago