Political News

ధ‌ర్మాన డుమ్మా.. వైసీపీకి గుడ్ బై ఖాయం.. !

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. వైసీపీకి గుడ్ బై చెప్ప‌డం దాదాపు ఖ‌రారైంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయ‌కు ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మావేశం పెట్టినా.. ఆయ‌న రాలేదు. ఆయ‌న కుమారుడిని కూడా పంపించ లేదు. ఈ క్ర‌మంలోనే ధర్మాన వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేశారు. గుర్రాన్ని నీటి వ‌ర‌కు మాత్ర‌మే తీసుకువెళ్ల‌గ‌ల‌మ‌ని.. నీళ్లు తాగించ‌లేమ‌ని అన్నారు. అంటే.. ధ‌ర్మాన‌కు శ్రీకాకుళం జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించినా.. ఆయ‌న తీసుకునేందుకు సిద్ధంగా లేర‌న్న విష‌యాన్ని జ‌గ‌న్ సీరియ‌స్‌గానే తీసుకున్నారు.

అలాగ‌ని బ్ర‌తిమాలే దృక్ఫ‌థంమాత్రం జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ధ‌ర్మాన ఎందుకు వైసీపీని వీడాల‌ని అనుకుంటున్నార‌నే ప్ర‌శ్న కూడా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు.. ఉత్త‌రాంధ్ర ప‌గ్గాల‌ను వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించారు. అయితే.. ఈ నియామ‌కాన్ని ధ‌ర్మాన అడ్డుకున్నా రు. ఆయ‌న ను వ‌ద్ద‌ని చెప్పారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ విష‌యంపై ఆయ‌న కామెంట్లు కూడా చేశారు. కానీ, జ‌గ‌న్ మాత్రం వినిపించుకోలేదు. త‌ర్వాత‌.. కాలంలో ధ‌ర్మాన వైవీల మ‌ధ్య వివాదాలు కూడా వ‌చ్చాయి.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో భూములు దోచుకునేందుకు వైవీ వ‌చ్చారంటూ.. అనుచరుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ధ‌ర్మాన చెప్పుకొచ్చారు. దీనిపై అంత‌ర్గ‌తంగా పార్టీలోనూ చ‌ర్చ జ‌రిగింది. అంటే.. వైవీని త‌న‌కు వ్య‌తిరేకంగా నియ‌మించార‌ని.. ఉత్త‌రాంధ్ర‌లో త‌న‌ను, త‌న రాజ‌కీయాల‌ను అడ్డుకునేందుకు వైవీని పంపించార‌న్న వాద‌న ధ‌ర్మాన వ‌ర్గంలో వినిపించింది. దీనికి తోడు.. ఎన్నిక‌ల్లోత‌న కుమారుడికి టికెట్ ఆశించారు. దీనికి జ‌గ‌న్ అంగీక‌రించ‌లేదు.

ఇక‌, పార్టీ ప‌రంగా గుత్తాధిప‌త్యాన్ని కోరుకున్న మాట కూడా.. వాస్త‌వ‌మే. కానీ, జిల్లాపై అజ‌మాయిషీని జ‌గ‌న్ ఆయ‌న‌కు అప్ప‌గించ‌లేదు. ఈ ప‌రిణామాల‌తోనే ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నార‌న్న‌ది రాజ‌కీయం గా జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనిని ఇటు పార్టీ కానీ అటు ధ‌ర్మాన కానీ. నిర్ధారించ‌డం లేదు. ఏదో గ్యాప్ అయితేఉంది. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని, సంక్రాంతి త‌ర్వాత‌.. చేరిక‌లు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రిఏం జ‌రుగుతుందో చూడాలి. 

This post was last modified on December 8, 2024 8:57 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago