Political News

కాకినాడ చిచ్చు: కూట‌మి vs వైసీపీ స‌వాళ్ల ప‌ర్వం

కాకినాడ‌లో ప‌దిహేనేళ్ల కింద‌ట వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్‌(ఎస్ ఈజెడ్‌) వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాజ‌కీయ వివాదాల‌కు కేంద్రంగా మారింది. ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో వైసీపీ నాయ‌కులు భూములు అక్ర‌మంగా తీసుకున్నార‌ని.. కూట‌మి లో టీడీపీ, జ‌న‌సేన‌ పార్టీల నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని గ‌త రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారింది.

ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో కొన్ని భూముల‌ను వైసీపీ నాయ‌కులు బ‌ల‌వంతంగా రాయించుకున్నార‌ని.. జ‌న‌సేన నాయ‌కులు తొలుత ఆరోపించారు. ఆ త‌ర్వాత‌.. దీనికి టీడీపీ నేత‌లు తోడ‌య్యారు. వైసీపీకి చెందిన కుర‌సాల క‌న్న‌బాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత‌కు చెందిన అనుచ‌రులు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. ఆయా భూముల విలువ ఇప్పుడు రూ.కోట్ల‌కు చేరింద‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగా భూములు రాయించుకున్న వీరిని అరెస్టు చేయ‌డంతోపాటు.. ఆయా భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌న్న‌ది కూట‌మి నాయ‌కుల డిమాండ్‌.

ఈ విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. అయితే.. ఆ వెంట‌నే జోక్యం చేసుకున్న కుర‌సాల క‌న్న‌బాబు, దాడి శెట్టి రాజా, వంగా గీత‌లు మీడియా ముందుకు వ‌చ్చారు. తాము అన్ని రుసుములు చెల్లించి కొనుగోలుచేశామ‌ని.. దీనిలో అక్ర‌మాలు లేవ‌న్నారు. దాడి శెట్టి రాజా తాను నాలుగు ఎక‌రాలు కొన్నాన‌ని.. త‌ప్పేముంద‌ని చెప్పారు. అయితే.. ఎస్ ఈజెడ్‌కు కేటాయించిన స్థ‌లంలో వ్యాపార స‌ముదాయాలు పెట్టేవారు మాత్ర‌మే ముందుకు రావాల్సి ఉంటుంది. ఇత‌రులు భూములు కొనుగోలు చేయ‌డానికి వీల్లేదు.

ఈ పాయింట్ మీదే.. కూట‌మి నాయ‌కులు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఎన్ వీఎస్ ఎస్ వ‌ర్మ‌(ప‌వ‌న్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు) మీడియా ముందుకు వ‌చ్చారు. స్వ‌లాభం కోస‌మే.. వైసీపీ నాయ‌కులు భూములు కొనుగోలు చేశార‌ని.. కాద‌ని నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వారి బినామాల‌తో భూములు కొనుగోలు చేయించార‌ని విమ‌ర్శించారు. దీనిపై ఉప్పాడ జంక్ష‌న్‌లో చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాను అక్క‌డ‌కు వ‌స్తున్నాన‌ని.. ద‌మ్ముంటే.. త‌ప్పు చేయ‌క‌పోతే.. వైసీపీ నాయ‌కులు రావాల‌ని ఆయ‌న బ‌హిరంగ స‌వాల్ విసిరారు. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా రియాక్ట్ అయ్యారు. ద‌మ్ముంటే.. కూట‌మి ప్ర‌భుత్వం ఎస్ ఈజెడ్‌ను ర‌ద్దు చేయాల‌ని స‌వాల్ రువ్వారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌వాళ్ల విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. ఇరు ప‌క్షాల‌ను ఉప్పాడ జంక్ష‌న్‌కు రానివ్వ‌బోమ‌ని పోలీసు అధికారులు తెలిపారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

5 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

7 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

7 hours ago