Political News

కాకినాడ చిచ్చు: కూట‌మి vs వైసీపీ స‌వాళ్ల ప‌ర్వం

కాకినాడ‌లో ప‌దిహేనేళ్ల కింద‌ట వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్‌(ఎస్ ఈజెడ్‌) వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాజ‌కీయ వివాదాల‌కు కేంద్రంగా మారింది. ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో వైసీపీ నాయ‌కులు భూములు అక్ర‌మంగా తీసుకున్నార‌ని.. కూట‌మి లో టీడీపీ, జ‌న‌సేన‌ పార్టీల నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని గ‌త రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారింది.

ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో కొన్ని భూముల‌ను వైసీపీ నాయ‌కులు బ‌ల‌వంతంగా రాయించుకున్నార‌ని.. జ‌న‌సేన నాయ‌కులు తొలుత ఆరోపించారు. ఆ త‌ర్వాత‌.. దీనికి టీడీపీ నేత‌లు తోడ‌య్యారు. వైసీపీకి చెందిన కుర‌సాల క‌న్న‌బాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత‌కు చెందిన అనుచ‌రులు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. ఆయా భూముల విలువ ఇప్పుడు రూ.కోట్ల‌కు చేరింద‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగా భూములు రాయించుకున్న వీరిని అరెస్టు చేయ‌డంతోపాటు.. ఆయా భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌న్న‌ది కూట‌మి నాయ‌కుల డిమాండ్‌.

ఈ విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. అయితే.. ఆ వెంట‌నే జోక్యం చేసుకున్న కుర‌సాల క‌న్న‌బాబు, దాడి శెట్టి రాజా, వంగా గీత‌లు మీడియా ముందుకు వ‌చ్చారు. తాము అన్ని రుసుములు చెల్లించి కొనుగోలుచేశామ‌ని.. దీనిలో అక్ర‌మాలు లేవ‌న్నారు. దాడి శెట్టి రాజా తాను నాలుగు ఎక‌రాలు కొన్నాన‌ని.. త‌ప్పేముంద‌ని చెప్పారు. అయితే.. ఎస్ ఈజెడ్‌కు కేటాయించిన స్థ‌లంలో వ్యాపార స‌ముదాయాలు పెట్టేవారు మాత్ర‌మే ముందుకు రావాల్సి ఉంటుంది. ఇత‌రులు భూములు కొనుగోలు చేయ‌డానికి వీల్లేదు.

ఈ పాయింట్ మీదే.. కూట‌మి నాయ‌కులు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఎన్ వీఎస్ ఎస్ వ‌ర్మ‌(ప‌వ‌న్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు) మీడియా ముందుకు వ‌చ్చారు. స్వ‌లాభం కోస‌మే.. వైసీపీ నాయ‌కులు భూములు కొనుగోలు చేశార‌ని.. కాద‌ని నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వారి బినామాల‌తో భూములు కొనుగోలు చేయించార‌ని విమ‌ర్శించారు. దీనిపై ఉప్పాడ జంక్ష‌న్‌లో చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాను అక్క‌డ‌కు వ‌స్తున్నాన‌ని.. ద‌మ్ముంటే.. త‌ప్పు చేయ‌క‌పోతే.. వైసీపీ నాయ‌కులు రావాల‌ని ఆయ‌న బ‌హిరంగ స‌వాల్ విసిరారు. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా రియాక్ట్ అయ్యారు. ద‌మ్ముంటే.. కూట‌మి ప్ర‌భుత్వం ఎస్ ఈజెడ్‌ను ర‌ద్దు చేయాల‌ని స‌వాల్ రువ్వారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌వాళ్ల విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. ఇరు ప‌క్షాల‌ను ఉప్పాడ జంక్ష‌న్‌కు రానివ్వ‌బోమ‌ని పోలీసు అధికారులు తెలిపారు.

This post was last modified on December 8, 2024 8:50 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

9 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

9 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

10 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

10 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

11 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

12 hours ago