Political News

ఉత్త‌రాంధ్ర నుంచే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..షెడ్యూల్ ప్రిప‌రేష‌న్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెల జ‌న‌వ‌రి నుంచి తాడేప‌ల్లి ప్యాల‌స్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్పిన విస‌యం తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన అనంత‌రం.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది లేదు. కేవ‌లం బెంగ‌ళూరు-కడ‌ప‌-తాడేప‌ల్లి అన్న‌ట్టుగా ఆయ‌న ప‌రిస్థితి మారిపోయింది. మ‌రోవైపు పార్టీ నుంచి పోయే నాయ‌కులుపోతున్నారు. వ‌చ్చే వారు క‌నిపించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలోనూ వైసీపీకి సానుభూతి లేకుండాపోయింది.

ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ ఇక‌, క‌ద‌లాల్సిందేన‌ని నిర్ణ‌యించుకుని తాడేప‌ల్లి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ఇటీవ‌ల చెప్పారు. ఈ క్ర‌మంలోనే జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆయ‌న రెడీ అయ్యారు. అంతేకాదు.. కేడర్‌ను కూడా ఆయ‌న‌ ప్రిపేర్ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలతో వ‌రుస‌గా తాడేప‌ల్లిలో ఆయ‌న‌ సమావేశమవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాను జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తాన‌ని.. ప్రతి బుధవారం, గురువారం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించి షెడ్యూల్ సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఉత్త‌రాంధ్ర నుంచి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభం అవుతాయ‌ని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ‌గా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న తొలి ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అర‌కు పార్ల‌మెంటు నుంచితొలి ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని.. త‌ర్వాత పాడేరు వంటి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది.

టార్గెట్ సూప‌ర్ సిక్స్‌!

వైసీపీ అధినేత త‌న ప‌ర్య‌ట‌న‌లో కూట‌మి పార్టీలు ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌నే టార్గెట్ చేసుకుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. పరిపాలనలో ఆరుమాసాల్లోనే విఫలమైందని ప్రజలను ఆదుకునే వారు లేకుండా పోయారన్న ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. కూట‌మి స‌ర్కారు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌.. ముఖ్యంగా మాతృవంద‌నం, మ‌హిళ‌ల‌కు రూ.1500 నిధులు, రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ వంటి వాటిని ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది.

This post was last modified on December 8, 2024 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

35 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago