Political News

ఉత్త‌రాంధ్ర నుంచే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..షెడ్యూల్ ప్రిప‌రేష‌న్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే నెల జ‌న‌వ‌రి నుంచి తాడేప‌ల్లి ప్యాల‌స్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్పిన విస‌యం తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన అనంత‌రం.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ది లేదు. కేవ‌లం బెంగ‌ళూరు-కడ‌ప‌-తాడేప‌ల్లి అన్న‌ట్టుగా ఆయ‌న ప‌రిస్థితి మారిపోయింది. మ‌రోవైపు పార్టీ నుంచి పోయే నాయ‌కులుపోతున్నారు. వ‌చ్చే వారు క‌నిపించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలోనూ వైసీపీకి సానుభూతి లేకుండాపోయింది.

ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ ఇక‌, క‌ద‌లాల్సిందేన‌ని నిర్ణ‌యించుకుని తాడేప‌ల్లి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ఇటీవ‌ల చెప్పారు. ఈ క్ర‌మంలోనే జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆయ‌న రెడీ అయ్యారు. అంతేకాదు.. కేడర్‌ను కూడా ఆయ‌న‌ ప్రిపేర్ చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలతో వ‌రుస‌గా తాడేప‌ల్లిలో ఆయ‌న‌ సమావేశమవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాను జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తాన‌ని.. ప్రతి బుధవారం, గురువారం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ఉండి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించి షెడ్యూల్ సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఉత్త‌రాంధ్ర నుంచి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభం అవుతాయ‌ని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ‌గా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న తొలి ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అర‌కు పార్ల‌మెంటు నుంచితొలి ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని.. త‌ర్వాత పాడేరు వంటి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు ఈ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది.

టార్గెట్ సూప‌ర్ సిక్స్‌!

వైసీపీ అధినేత త‌న ప‌ర్య‌ట‌న‌లో కూట‌మి పార్టీలు ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌నే టార్గెట్ చేసుకుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. పరిపాలనలో ఆరుమాసాల్లోనే విఫలమైందని ప్రజలను ఆదుకునే వారు లేకుండా పోయారన్న ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. కూట‌మి స‌ర్కారు ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్‌.. ముఖ్యంగా మాతృవంద‌నం, మ‌హిళ‌ల‌కు రూ.1500 నిధులు, రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ వంటి వాటిని ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది.

This post was last modified on December 8, 2024 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

3 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

7 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

14 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

24 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

51 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago