ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. సుగాలీ ప్రీతి అనే విద్యార్థిని పాఠశాలలో ఉరి వేసుకొని మృతి చెందిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ కేసును గత ప్రభుత్వం విస్మరించిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ పున:ప్రారంభించామని అన్నారు.
సుగాలీ ప్రీతి కేసులో యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నామని. ఆడబిడ్డల భద్రత చాలా కీలకమని అన్నారు. పాఠశాలల్లో ఆడబిడ్డల భద్రత కోసం…సీసీటీవీ కెమెరాలు పెట్టే ప్రతిపాదనల గురించి సీఎం చంద్రబాబు కూడా యోచిస్తున్నారని చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే చర్యలు చేపట్టేందుకు కెమెరాలుండాలని వవన్ అభిప్రాయపడ్డారు. కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు.
This post was last modified on December 8, 2024 9:15 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…