ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. సుగాలీ ప్రీతి అనే విద్యార్థిని పాఠశాలలో ఉరి వేసుకొని మృతి చెందిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ కేసును గత ప్రభుత్వం విస్మరించిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ పున:ప్రారంభించామని అన్నారు.
సుగాలీ ప్రీతి కేసులో యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నామని. ఆడబిడ్డల భద్రత చాలా కీలకమని అన్నారు. పాఠశాలల్లో ఆడబిడ్డల భద్రత కోసం…సీసీటీవీ కెమెరాలు పెట్టే ప్రతిపాదనల గురించి సీఎం చంద్రబాబు కూడా యోచిస్తున్నారని చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే చర్యలు చేపట్టేందుకు కెమెరాలుండాలని వవన్ అభిప్రాయపడ్డారు. కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు.
This post was last modified on December 8, 2024 9:15 am
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…