ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. సుగాలీ ప్రీతి అనే విద్యార్థిని పాఠశాలలో ఉరి వేసుకొని మృతి చెందిందని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ కేసును గత ప్రభుత్వం విస్మరించిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు విచారణ పున:ప్రారంభించామని అన్నారు.
సుగాలీ ప్రీతి కేసులో యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నామని. ఆడబిడ్డల భద్రత చాలా కీలకమని అన్నారు. పాఠశాలల్లో ఆడబిడ్డల భద్రత కోసం…సీసీటీవీ కెమెరాలు పెట్టే ప్రతిపాదనల గురించి సీఎం చంద్రబాబు కూడా యోచిస్తున్నారని చెప్పారు. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే చర్యలు చేపట్టేందుకు కెమెరాలుండాలని వవన్ అభిప్రాయపడ్డారు. కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్-టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు.
This post was last modified on December 8, 2024 9:15 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…