Political News

చంద్ర‌బాబు భ‌య ప‌డుతున్నారు: ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు భ‌య‌పడుతున్నారంటూ.. ఆమె చేసిన కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ క‌మిటీలు వేశార‌ని, ఇది మంచి ప‌రిణా మ‌మేన‌ని చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డం, కాకినాడ పోర్టు కేంద్రంగాజ‌రిగిన రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చ‌డం వ‌ర‌కు బాగానే ఉంద‌ని పేర్కొన్నారు.

అయితే.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీతో సోలార్ ప‌వ‌ర్ కు సంబంధించి జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాలు.. ఈ క్ర‌మంలో తీసుకున్న రూ.1750 కోట్ల లంచాల విష‌యాన్ని ఎందుకు తేల్చడం లేద‌ని ష‌ర్మిల నిగ్గ‌దీశారు. తాము ఏసీబీకి ఫిర్యాదు చేసిన త‌ర్వాత కూడా.. జ‌గ‌న్‌పై ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అంటే.. జ‌గ‌న్‌పై కేసు పెట్టేందుకు చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారా? అని ష‌ర్మిల నిల‌దీశారు. అంతేకాదు.. గ‌తంలో జ‌గ‌న్‌.. అదానీతో కుమ్మ‌క్కు అయ్యార‌న్న ఆమె.. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అలా చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇప్ప‌టికే ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టొచ్చుకదా? అని ప్ర‌శ్నించారు. నిజానిజాలు నిగ్గు తేల్చే బాధ్యత చంద్ర‌బాబు లేదా? అని అన్నారు. జ‌గ‌న్‌, అదానీల‌ను అరెస్టు చేస్తేనే వాస్త‌వాలు వెలుగు చూస్తాయ‌న్నారు. లంచంగా పుచ్చుకున్న సొమ్మును రిక‌వ‌రీ చేసి.. దానిని విద్యుత్ న‌ష్టాల కింద తీసుకుని.. ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ విష‌యంలో దాప‌రికాలు జ‌రిగితే.. ప్ర‌జ‌లు మ‌రింత న‌ష్ట‌పోతార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాతికేళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల భారం ప‌డింద‌ని ష‌ర్మిల అన్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ కూడా ఈ ఒప్పందాల‌పై(ప‌య్యావుల కేశ‌వ్‌) హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యాన్ని మ‌రిచిపోయారా? అని అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేసిన విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌ని కోరారు. ఇన్ని ఆధారాలు ప‌క్కాగా ఉన్న‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

50 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago