Political News

చంద్ర‌బాబు భ‌య ప‌డుతున్నారు: ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు భ‌య‌పడుతున్నారంటూ.. ఆమె చేసిన కామెంట్లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ క‌మిటీలు వేశార‌ని, ఇది మంచి ప‌రిణా మ‌మేన‌ని చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డం, కాకినాడ పోర్టు కేంద్రంగాజ‌రిగిన రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను నిగ్గుతేల్చ‌డం వ‌ర‌కు బాగానే ఉంద‌ని పేర్కొన్నారు.

అయితే.. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీతో సోలార్ ప‌వ‌ర్ కు సంబంధించి జ‌గ‌న్ చేసుకున్న ఒప్పందాలు.. ఈ క్ర‌మంలో తీసుకున్న రూ.1750 కోట్ల లంచాల విష‌యాన్ని ఎందుకు తేల్చడం లేద‌ని ష‌ర్మిల నిగ్గ‌దీశారు. తాము ఏసీబీకి ఫిర్యాదు చేసిన త‌ర్వాత కూడా.. జ‌గ‌న్‌పై ఎందుకు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అంటే.. జ‌గ‌న్‌పై కేసు పెట్టేందుకు చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారా? అని ష‌ర్మిల నిల‌దీశారు. అంతేకాదు.. గ‌తంలో జ‌గ‌న్‌.. అదానీతో కుమ్మ‌క్కు అయ్యార‌న్న ఆమె.. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అలా చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇప్ప‌టికే ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టొచ్చుకదా? అని ప్ర‌శ్నించారు. నిజానిజాలు నిగ్గు తేల్చే బాధ్యత చంద్ర‌బాబు లేదా? అని అన్నారు. జ‌గ‌న్‌, అదానీల‌ను అరెస్టు చేస్తేనే వాస్త‌వాలు వెలుగు చూస్తాయ‌న్నారు. లంచంగా పుచ్చుకున్న సొమ్మును రిక‌వ‌రీ చేసి.. దానిని విద్యుత్ న‌ష్టాల కింద తీసుకుని.. ప్ర‌జ‌ల‌పై భారం త‌గ్గించాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ విష‌యంలో దాప‌రికాలు జ‌రిగితే.. ప్ర‌జ‌లు మ‌రింత న‌ష్ట‌పోతార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాతికేళ్ల పాటు చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రజల నెత్తిన లక్ష కోట్ల భారం ప‌డింద‌ని ష‌ర్మిల అన్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ కూడా ఈ ఒప్పందాల‌పై(ప‌య్యావుల కేశ‌వ్‌) హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యాన్ని మ‌రిచిపోయారా? అని అన్నారు. ఈ డీల్ రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేసిన విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేసుకోవాల‌ని కోరారు. ఇన్ని ఆధారాలు ప‌క్కాగా ఉన్న‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు.

This post was last modified on December 8, 2024 9:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

44 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

50 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

1 hour ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

2 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

3 hours ago