Political News

దేశంలోనే ఏపీ బెస్ట్.. ఇదిగో సాక్ష్యం

దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో అత్యుత్తమంగా ప్రదర్శించిన గ్రామాలకు అందజేస్తారు.

అవార్డు పొందిన గ్రామాలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామం తాగునీటి అందుబాటులో “సంతృప్తికర తాగునీరు” కేటగిరీలో విజయం సాధించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామం “ఆరోగ్యకర” కేటగిరీలో ఎంపికైంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామం “సామాజిక భద్రత” కేటగిరీలో నిలిచింది.

అంతేకాదు, అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం “పచ్చదనం-పరిశుభ్రత” కేటగిరీలో జాతీయ గుర్తింపు పొందింది. ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ నెల 11న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్‌లు మెమెంటోలను అందుకోవడంతో పాటు, రూ. కోటి చొప్పున నగదు బహుమతిని కూడా స్వీకరించనున్నారు.

ఈ గుర్తింపులు ఆయా గ్రామాల్లో సమిష్టి కృషికి ప్రతీకగా నిలిచాయి. గ్రామ అభివృద్ధికి గ్రామస్థుల చొరవ, సర్పంచ్‌ల నాయకత్వం కారణంగా అవార్డులు సాధించగలిగినట్లు తెలుస్తోంది. ఈ గుర్తింపులు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్‌లో మరింత గ్రామ పంచాయతీలు ఇలాంటి గుర్తింపులను పొందాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

This post was last modified on December 8, 2024 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

45 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago