దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో అత్యుత్తమంగా ప్రదర్శించిన గ్రామాలకు అందజేస్తారు.
అవార్డు పొందిన గ్రామాలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామం తాగునీటి అందుబాటులో “సంతృప్తికర తాగునీరు” కేటగిరీలో విజయం సాధించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామం “ఆరోగ్యకర” కేటగిరీలో ఎంపికైంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామం “సామాజిక భద్రత” కేటగిరీలో నిలిచింది.
అంతేకాదు, అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం “పచ్చదనం-పరిశుభ్రత” కేటగిరీలో జాతీయ గుర్తింపు పొందింది. ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 11న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్లు మెమెంటోలను అందుకోవడంతో పాటు, రూ. కోటి చొప్పున నగదు బహుమతిని కూడా స్వీకరించనున్నారు.
ఈ గుర్తింపులు ఆయా గ్రామాల్లో సమిష్టి కృషికి ప్రతీకగా నిలిచాయి. గ్రామ అభివృద్ధికి గ్రామస్థుల చొరవ, సర్పంచ్ల నాయకత్వం కారణంగా అవార్డులు సాధించగలిగినట్లు తెలుస్తోంది. ఈ గుర్తింపులు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్లో మరింత గ్రామ పంచాయతీలు ఇలాంటి గుర్తింపులను పొందాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
This post was last modified on December 8, 2024 9:08 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…