దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో అత్యుత్తమంగా ప్రదర్శించిన గ్రామాలకు అందజేస్తారు.
అవార్డు పొందిన గ్రామాలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామం తాగునీటి అందుబాటులో “సంతృప్తికర తాగునీరు” కేటగిరీలో విజయం సాధించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామం “ఆరోగ్యకర” కేటగిరీలో ఎంపికైంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామం “సామాజిక భద్రత” కేటగిరీలో నిలిచింది.
అంతేకాదు, అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం “పచ్చదనం-పరిశుభ్రత” కేటగిరీలో జాతీయ గుర్తింపు పొందింది. ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ నెల 11న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్లు మెమెంటోలను అందుకోవడంతో పాటు, రూ. కోటి చొప్పున నగదు బహుమతిని కూడా స్వీకరించనున్నారు.
ఈ గుర్తింపులు ఆయా గ్రామాల్లో సమిష్టి కృషికి ప్రతీకగా నిలిచాయి. గ్రామ అభివృద్ధికి గ్రామస్థుల చొరవ, సర్పంచ్ల నాయకత్వం కారణంగా అవార్డులు సాధించగలిగినట్లు తెలుస్తోంది. ఈ గుర్తింపులు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్లో మరింత గ్రామ పంచాయతీలు ఇలాంటి గుర్తింపులను పొందాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
This post was last modified on December 8, 2024 9:08 am
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…