ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుత్రోత్సాహంతో సంతోషం వ్యక్తం చేశారు. `వెల్డన్ లోకేష్` అంటూ తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి కారణం.. తన తండ్రి, సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును స్వయంగా నారా లోకేష్ తీయడమే! ఏపీలో జరిగిన విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాలను పురస్కరించుకుని చంద్రబాబు, లోకేష్లు బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి ఇరువురూ మధ్యాహ్నం భోజనం చేశారు.
సీఎం, మంత్రి.. ఇరువురూ నేలపైనే కూర్చుని విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం చేశారు. అనంతరం.. సీఎం చంద్రబాబు తను తిన్న ప్లేటును అక్కడే వదిలేయగా.. నారా లోకేష్ తన భోజనం అయిపోయిన తర్వాత.. తన ప్లేటుతోపాటు సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును కూడా ఎత్తారు. ఇంతలో సహాయకురాలు రావడంతో ఆమెకు ఆ రెండు ప్లేట్లు, గ్లాసులు అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని తిలకించిన నారా లోకేష్ మాతృమూర్తి భువనేశ్వరి ఉప్పొంగిపోయారు. పత్రోత్సాహం వ్యక్తీకరించారు.
వెల్డన్ నారా లోకేష్ .. అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. “చంద్రబాబుగారు భోజనం చేసిన ప్లేట్ను తీసుకుని శుభ్రపరిచే ప్రయత్నం చేయడం నీ ఆలోచనాత్మకమైన దృక్ఫథాన్ని ప్రతిబింబిస్తోంది. భోజన అనంతరం శుభ్రం చేస్తున్న పాఠశాల సిబ్బందికి సాయపడడం బాగుంది. తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెబుతున్నాయి. నిత్యం మనకు సహాయకారిగా(పనివాళ్లు) ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టం చేశావు. నిజంగా ఇది స్ఫూర్తిదాయకంష అని నారా భువనేశ్వరి ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో భువనేశ్వరి చేసిన పోస్టుకు భారీ సంఖ్యలో లైకులు పడుతుండడం గమనార్హం.
This post was last modified on December 7, 2024 11:43 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…