Political News

విద్యార్థులతో బాబు, లోకేష్ మిడ్ డే మీల్స్

బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిడ్ డే మీల్స్ ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, పాఠశాలలో విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో కలిసి పోయి కింద కూర్చొని చంద్రబాబు, లోకేష్ భోజనం చేశారు.

విద్యార్థులకు ఏ రోజు ఏ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని మిడ్ డే మీల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చక్కెర పొంగళి పెడుతున్నారా అని ప్రశ్నించారు. సాదాసీదా వ్యక్తులుగా కింద కూర్చొని విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనం పథకం ఆహారాన్ని రుచి చూసిన చంద్రబాబు, లోకేశ్ లపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

గత ప్రభుత్వంలో నాయకులు ఏనాడూ ఇలా విద్యార్థులతో కూర్చొని భోజనం చేసిన దాఖలాలు లేవని నెటిజన్లు అంటున్నారు. పిల్లలకు అందించే ఫల్లీ చిక్కీలపై కూడా తన ఫొటో వేసుకున్న జగన్ విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై దృష్టిపెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. త్వరలో ఇంటర్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెట్టాలని మంత్రి నారా లోకేశ్ యోచిస్తున్నారని, గత ప్రభుత్వం లో ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు అని లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on December 7, 2024 4:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

1 hour ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

1 hour ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

1 hour ago

ఒక రోజుకే ప్రేక్షకులు మర్చిపోయారు

సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…

2 hours ago

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

2 hours ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

3 hours ago