Political News

విద్యార్థులతో బాబు, లోకేష్ మిడ్ డే మీల్స్

బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిడ్ డే మీల్స్ ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉందో విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, పాఠశాలలో విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో కలిసి పోయి కింద కూర్చొని చంద్రబాబు, లోకేష్ భోజనం చేశారు.

విద్యార్థులకు ఏ రోజు ఏ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని మిడ్ డే మీల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చక్కెర పొంగళి పెడుతున్నారా అని ప్రశ్నించారు. సాదాసీదా వ్యక్తులుగా కింద కూర్చొని విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనం పథకం ఆహారాన్ని రుచి చూసిన చంద్రబాబు, లోకేశ్ లపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

గత ప్రభుత్వంలో నాయకులు ఏనాడూ ఇలా విద్యార్థులతో కూర్చొని భోజనం చేసిన దాఖలాలు లేవని నెటిజన్లు అంటున్నారు. పిల్లలకు అందించే ఫల్లీ చిక్కీలపై కూడా తన ఫొటో వేసుకున్న జగన్ విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై దృష్టిపెట్టలేదని విమర్శలు వస్తున్నాయి. త్వరలో ఇంటర్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ పెట్టాలని మంత్రి నారా లోకేశ్ యోచిస్తున్నారని, గత ప్రభుత్వం లో ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు అని లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on December 7, 2024 4:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago