సాంకేతికతకు.. సీఎం చంద్రబాబుకు మధ్య సయామీ కవలల వంటి సంబంధం ఉన్న విషయం తెలిసిం దే. ఆయన ఏం చేసినాదానిలో సింహ భాగం.. సాంకేతికతకు పెద్దపీట వేస్తారు. ఎన్నికల సమయం నుంచి పాలన వరకు ఆయన టెక్నాలజీని వాడేస్తారు. అంతేకాదు.. ప్రజలకు కూడా టెక్నాలజీని చేరువ చేయ డంలోనూ.. విద్యార్థుల టెక్నికల్ ఆశలను విజయవంతం చేయడంలోనూ బాబుకు తగ్గ నాయకుడు బాబే అనడంలో సందేహం లేదు.
తాజాగా ఏపీని టెక్నాలజీలో నెంబర్ 1 దిశగాతీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చి(విజ్ఞాన కేంద్రం) దిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా విశాఖపట్నంలో ప్రారంభమైన.. డీప్టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్నాలజీపై అధిరిపోయే కాన్సెప్టును చెప్పుకొచ్చారు. నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతోందన్న ఆయన ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీపైనే దృష్టి పెడుతున్నారని, అందుకే నూతన మార్పులు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇప్పుడు టెక్నాలజీ పాత్ర పెరిగిపోయిందన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక తాను హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏపీలో ఇప్పుడు ఐటీకి ప్రాధాన్యం పెంచుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే పీ-4 విదానాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు.
టూరిజం సెక్టార్లో డీప్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే డ్రోన్లకు ప్రాధాన్యం పెంచుతున్నామని.. ఎక్కడికి వెళ్లినా.. డ్రోన్లు కనిపిస్తాయన్నారు. వ్యవసాయం నుంచి ఉపాధి వరకు డ్రోన్ల పాత్రను పెంచుతున్నట్టు చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదన్న చంద్రబాబు.. ప్రతి ఇంట్లోనూ టెక్నికల్ ఉద్యోగాలు లభించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నారు. ఈ కాన్సెప్టును ప్రజలకు వివరించేందుకు త్వరలోనే తాను సదస్సులు నిర్వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
This post was last modified on December 6, 2024 6:39 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…