అనంపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజూ ప్రజలకు చేరువయ్యారు.
అదేవిధంగా స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కూడా పరిష్కరించారని అంటారు. అయితే.. ధర్మవరంలో బీజేపీ గెలిచిన తర్వాత.. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యాక ఇక్కడ సీన్ మారిపోయిందని చెబుతున్నారు.
వెంకట్రామిరెడ్డి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు.. నిరంతరం బయటకు వచ్చిన కేతిరెడ్డి ఇప్పుడు ఇల్లు కదలడం లేదు.
దీనికి కారణం.. బయటకు వచ్చి కూటమి సర్కారుపై ఎలాంటి విమర్శలు చేసినా.. అవి తన వ్యాపారాలపైనా.. ఆస్తులపై ప్రభావం చూపుతాయని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంట్లోనే కూర్చుని వీడియో లు చేసుకుంటున్నారు. వైసీపీ తప్పులను ఆయన ఎత్తిచూపుతున్నారు.
అయినప్పటికీ.. కేతిరెడ్డిని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన 45 ఎకరాల భూముల దోపిడీ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.
ధర్మవరంలోని కీలక చెరువు 1700 ఎకరాల్లో ఉంది. దీనిలో 45 ఎకరాలను ఆక్రమించి.. ఆయన వదిన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారన్నది ప్రధాన అభియోగం. వాస్తవానికి చెరువులు..కుంటలు అనేవి ఆక్రమించేందుకు వీలు లేదని.. వాల్టా చట్టం చెబుతోంది. ఎవరైనా ఆక్రమిస్తే.. 500 శాతం పరిహారం వసూలు చేసే రైట్స్ ఉంటాయి.
ఈ విషయంపైనే కూటమి నేతలు, ముఖ్యంగా మంత్రి సత్య కుమార్ అనుచరులు దృష్టి పెట్టారు. ఈ భూములను వెనక్కి తీసుకోవడంతోపాటు.. జరిమానా కూడా భారీగా విధించాలన్నది వారి డిమాండ్గా ఉంది. అయితే.. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయి.
ఫాం హౌస్ సహా.. గుర్రపు శాల, క్రీడా మైదానం వంటివి నిర్మించారు. అయినప్పటికీ.. వీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోయిన దరిమిలా.. ప్రభుత్వ పరంగా దూకుడు పెంచితే ఫలితం ఆశించినట్టు ఉండదని గ్రహించి.. న్యాయపరంగా పోరాటానికి దిగారు. దీంతో కేతిరెడ్డి అడ్డంగా దొరికి పోవడం ఖాయమన్న చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on December 6, 2024 11:44 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…