Movie News

సమంత ట్రీట్మెంట్ కి 25 లక్షలు సహాయం చేసాను : ప్రొడ్యూసర్

యశోద సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన హీరోయిన్ సమంత ఆ తర్వాత శాకుంతలం, ఖుషి ప్రమోషన్లకు సైతం ఇబ్బంది పడుతూ పాల్గొంది. ఒకదశలో షూటింగులే వద్దనుకుని చికిత్స కోసం తగినంత సమయం తీసుకుని రాజ్ అండ్ డికె ప్రోత్సహించడం వల్లే సిటాడెల్ హానీ బన్నీ చేసింది. ప్రస్తుతం ఎవరికి కొత్తగా కమిట్ మెంట్లు ఇవ్వకుండా సొంత బ్యానర్ మీద మా ఇంటి బంగారం ప్రాజెక్టుని కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేసింది. క్యాస్టింగ్, దర్శకుడు, సాంకేతిక వర్గం ఇతర వివరాలు ఇంకా చెప్పలేదు. తాజాగా తన ఆరోగ్యం గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

పాతిక సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వెల్లడి చేసిన విషయాల్లో సమంతా ప్రస్తావన వచ్చింది. అదేంటో చూద్దాం. అల్లుడు శీను టైంలోనే సామ్ కు చర్మానికి సంబంధించిన జబ్బొకటి బయట పడింది. త్వరగా కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పుడున్న పరిస్థితుల వల్ల వేరే నిర్మాతలు స్పందించకపోతే బెల్లంకొండ సురేషే పాతిక లక్షలు పంపారు. అంతే కాకుండా పార్క్ హయత్ లో ఒక సింగల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ తీసిచ్చి వసతితో పాటు ఇంటి నుంచి క్యారియర్ వెళ్లేలా చేశారు. ఆ కృతజ్ఞత సురేష్ పట్ల సమంతకు ఇప్పటికీ ఉండటం వల్ల వీళ్ళ ఫ్యామిలీని కలుస్తూ ఉంటుంది.

అయితే రెండేళ్ల క్రితం వచ్చిన వ్యాధి వేరేనట. చూస్తుంటే సామ్ బయటికి చెప్పని చేదు విషయాలు చాలా ఉన్నాయన్న మాట. అల్లుడు శీను అంటే అప్పటికి తన కెరీర్ ఇంకా ప్రారంభంలో ఉంది. స్టార్ హీరోలతో జోడి కడుతున్న టైంలో ఇంత బాధను అనుభవించి సినిమాలు చేయడమంటే గ్రేటే. సిటాడెల్ హనీ బన్నీ ఆశించిన ఫలితం అందుకోకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. దీని కోసం సమంతా చాలా కష్టపడింది. నెలల తరబడి ఫైట్లలో శిక్షణ తీసుకోవడమే కాక రిస్కీ స్టంట్స్ చేసింది. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ప్రస్తుతం తుంబాడ్ సృష్టికర్తలు రక్త్ బ్రహ్మాండ్ లో నటిస్తోంది.

Kumar

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

8 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago