Political News

గ‌గ్గోలు పెట్టిన సాయిరెడ్డి!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్యస‌భ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. కాకినాడ పోర్టు విష‌యంలో కోనేరు వెంక‌టే శ్వ‌ర‌రావు(కేవీ రావు)ను బెదిరించార‌న్న కేసులో సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా స్పందించిన సాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. తానేమైనా దొంగ‌నా? దేశం విడిచిపారిపోతానా? అని ప్ర‌శ్నించారు. తాను బాధ్య‌తాయుత‌మైన రాజ్య‌స‌భ స‌భ్యుడిన‌ని.. అనేక అంశాల‌పై స‌భ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడుతున్నాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. అలాంటి త‌న‌ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌కు నోటీసులు జారీచేయ‌డంతో త‌న ప‌రువు పోయింద‌న్న సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు స‌హా వ్యాపార వేత్త కేవీరావుపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో కాకినాడ పోర్టు విష‌యంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సాయిరెడ్డి స్పందించారు. ఈ పోర్టులో వాటా కోసం.. అర‌బిందో (సాయిరెడ్డి అల్లుడి త‌ర‌ఫు సంస్థ‌) త‌ర‌ఫున వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని కేవీరావే.. ఏపీసీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విక్రాంత్ రెడ్డిపై బెదిరింపులు.. భ‌యపెట్టారు.. అనే కోణంలో ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. “విక్రాంత్ అమాయ‌కుడు. చిన్న పిల్ల‌వాడు. కేవీ రావు అనే వ్య‌క్తి అంత‌ర్జాతీయ బ్రోక‌ర్‌“ అని సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లో కూర్చుని లాబీయింగులు చేసుకునే కేవీ రావు.. బ‌డా పారిశ్రామిక‌వేత్త అని.. ప్ర‌భుత్వాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రని చెప్పుకొచ్చారు. అలాంటి వ్య‌క్తిని చిన్న పిల్లోడైన విక్రాంత్ రెడ్డి ఎలా ప్ర‌భావితం చేస్తాడ‌ని.. భ‌య‌పెడ‌తాడ‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. కేవీ రావు.. ఏడాదిలో సగం రోజులు అమెరికాలోనే ఉంటున్నాడ‌ని చెప్పారు. సింగ‌పూర్‌లో కేంద్ర‌కార్యాల‌యం ఉంద‌ని.. అక్క‌డ నుంచే బ్రోక‌ర్ ప‌నులు చేస్తున్నాడ‌ని ఆరోపించారు.

1997 నుంచి విచార‌ణ‌..

కాకినాడ సీ పోర్టు విష‌యంలో విచార‌ణ చేయాల్సి వ‌స్తే.. 1997 నుంచి విచార‌ణ జ‌రిపించాల‌ని.. దీనిని సీబీఐకి ఇవ్వాల‌ని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు.. ఈ పోర్టును ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశార‌న్న ఆయ‌న‌.. దీనిని ప్రైవేటుకు ఇచ్చిందే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. కాకినాడ సీ పోర్టును త‌న‌కు మిత్రుడైన కేవీ రావుకు అప్పగించార‌ని, సీఎండీని చేశార‌ని ఆరోపించారు. కాబ‌ట్టి అప్ప‌టి నుంచి విచార‌ణ జ‌రిపితేనే వాస్త‌వాలు తెలుస్తాయ‌న్నారు. నిజంగానే కేవీరావుకు అన్యాయం జ‌రిగి ఉంటే.. ఇన్నేళ్లు ఎందుకు వెయిట్ చేశార‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

This post was last modified on December 5, 2024 10:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

19 minutes ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

1 hour ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

3 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

3 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

4 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

5 hours ago