Political News

గ‌గ్గోలు పెట్టిన సాయిరెడ్డి!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్యస‌భ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. కాకినాడ పోర్టు విష‌యంలో కోనేరు వెంక‌టే శ్వ‌ర‌రావు(కేవీ రావు)ను బెదిరించార‌న్న కేసులో సాయిరెడ్డిపై ఏపీ సీఐడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై తాజాగా స్పందించిన సాయిరెడ్డి గ‌గ్గోలు పెట్టారు. తానేమైనా దొంగ‌నా? దేశం విడిచిపారిపోతానా? అని ప్ర‌శ్నించారు. తాను బాధ్య‌తాయుత‌మైన రాజ్య‌స‌భ స‌భ్యుడిన‌ని.. అనేక అంశాల‌పై స‌భ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడుతున్నాన‌ని కూడా.. చెప్పుకొచ్చారు. అలాంటి త‌న‌ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌కు నోటీసులు జారీచేయ‌డంతో త‌న ప‌రువు పోయింద‌న్న సాయిరెడ్డి సీఎం చంద్ర‌బాబు స‌హా వ్యాపార వేత్త కేవీరావుపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో కాకినాడ పోర్టు విష‌యంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సాయిరెడ్డి స్పందించారు. ఈ పోర్టులో వాటా కోసం.. అర‌బిందో (సాయిరెడ్డి అల్లుడి త‌ర‌ఫు సంస్థ‌) త‌ర‌ఫున వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. వైవీ సుబ్బారెడ్డి త‌న‌యుడు విక్రాంత్ రెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని కేవీరావే.. ఏపీసీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విక్రాంత్ రెడ్డిపై బెదిరింపులు.. భ‌యపెట్టారు.. అనే కోణంలో ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. “విక్రాంత్ అమాయ‌కుడు. చిన్న పిల్ల‌వాడు. కేవీ రావు అనే వ్య‌క్తి అంత‌ర్జాతీయ బ్రోక‌ర్‌“ అని సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లో కూర్చుని లాబీయింగులు చేసుకునే కేవీ రావు.. బ‌డా పారిశ్రామిక‌వేత్త అని.. ప్ర‌భుత్వాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రని చెప్పుకొచ్చారు. అలాంటి వ్య‌క్తిని చిన్న పిల్లోడైన విక్రాంత్ రెడ్డి ఎలా ప్ర‌భావితం చేస్తాడ‌ని.. భ‌య‌పెడ‌తాడ‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. కేవీ రావు.. ఏడాదిలో సగం రోజులు అమెరికాలోనే ఉంటున్నాడ‌ని చెప్పారు. సింగ‌పూర్‌లో కేంద్ర‌కార్యాల‌యం ఉంద‌ని.. అక్క‌డ నుంచే బ్రోక‌ర్ ప‌నులు చేస్తున్నాడ‌ని ఆరోపించారు.

1997 నుంచి విచార‌ణ‌..

కాకినాడ సీ పోర్టు విష‌యంలో విచార‌ణ చేయాల్సి వ‌స్తే.. 1997 నుంచి విచార‌ణ జ‌రిపించాల‌ని.. దీనిని సీబీఐకి ఇవ్వాల‌ని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు.. ఈ పోర్టును ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో ఏర్పాటు చేశార‌న్న ఆయ‌న‌.. దీనిని ప్రైవేటుకు ఇచ్చిందే అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు అని విమ‌ర్శించారు. కాకినాడ సీ పోర్టును త‌న‌కు మిత్రుడైన కేవీ రావుకు అప్పగించార‌ని, సీఎండీని చేశార‌ని ఆరోపించారు. కాబ‌ట్టి అప్ప‌టి నుంచి విచార‌ణ జ‌రిపితేనే వాస్త‌వాలు తెలుస్తాయ‌న్నారు. నిజంగానే కేవీరావుకు అన్యాయం జ‌రిగి ఉంటే.. ఇన్నేళ్లు ఎందుకు వెయిట్ చేశార‌ని సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

This post was last modified on December 5, 2024 10:58 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

48 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago