Political News

జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయం.. ఏసీబీ ఆఫీస్ వ‌ద్ద ష‌ర్మిల!

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి పీసీసీ చీఫ్ ష‌ర్మిల నిర‌సన బాట ప‌ట్టారు. బుధ‌వారం ఆమె ప్ర‌క‌టించిన‌ట్టుగానే గురువారం ఉద‌యం.. జ‌గ‌న్‌పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింద‌ని తెలిపారు. అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆధారాలు కూడా బయట పెట్టాయ‌న్నారు. విదేశాల్లోనే ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదన్నారు.

జ‌గ‌న్ అదానీ లంచాల కార‌ణంగా.. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం ప‌డింద‌ని ష‌ర్మిల ఆరోపించారు. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన ఆర్థిక‌ భారం పడుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేదని, ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గిందన్నారు. వ‌చ్చే రోజుల్లో సోలార్ యూనిట్ ధ‌ర రూ.050 పైసలకే వచ్చినా రావొచ్చ‌ని తెలిపారు. అలాంటి ప‌వ‌ర్ కోసం 25 ఏళ్లకు అగ్రిమెంట్ ఎలా చేశార‌ని జ‌గ‌న్‌ను నిల‌దీశారు.

యూనిట్ రూ.2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు మోపారని ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ సైతం అదాని అరాచ‌కాల‌పైనా అవినీతి అక్ర‌మాల‌పైనా పార్ల‌మెంటులో పోరాటం చేస్తున్న‌ట్టు చెప్పారు. అదానీ వ్య‌వ‌హారంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారని, తాము రాష్ట్రంలో ఆందోళ‌న‌లు చేస్తున్న‌ట్టు ష‌ర్మిల చెప్పుకొచ్చారు. ఈ కేసులో జగ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

This post was last modified on December 5, 2024 3:12 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

50 minutes ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

1 hour ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

14 hours ago