ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల నిరసన బాట పట్టారు. బుధవారం ఆమె ప్రకటించినట్టుగానే గురువారం ఉదయం.. జగన్పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని షర్మిల ప్రశ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యిందని తెలిపారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఆధారాలు కూడా బయట పెట్టాయన్నారు. విదేశాల్లోనే ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదన్నారు.
జగన్ అదానీ లంచాల కారణంగా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని షర్మిల ఆరోపించారు. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన ఆర్థిక భారం పడుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేదని, ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గిందన్నారు. వచ్చే రోజుల్లో సోలార్ యూనిట్ ధర రూ.050 పైసలకే వచ్చినా రావొచ్చని తెలిపారు. అలాంటి పవర్ కోసం 25 ఏళ్లకు అగ్రిమెంట్ ఎలా చేశారని జగన్ను నిలదీశారు.
యూనిట్ రూ.2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు మోపారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సైతం అదాని అరాచకాలపైనా అవినీతి అక్రమాలపైనా పార్లమెంటులో పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని, తాము రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నట్టు షర్మిల చెప్పుకొచ్చారు. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని షర్మిల వ్యాఖ్యానించారు.
This post was last modified on December 5, 2024 3:12 pm
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…