Political News

జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయం.. ఏసీబీ ఆఫీస్ వ‌ద్ద ష‌ర్మిల!

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి పీసీసీ చీఫ్ ష‌ర్మిల నిర‌సన బాట ప‌ట్టారు. బుధ‌వారం ఆమె ప్ర‌క‌టించిన‌ట్టుగానే గురువారం ఉద‌యం.. జ‌గ‌న్‌పై ఏపీ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చారు. అయితే.. దీనికి ముందే.. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీ – జగన్ రూ.1750 కోట్ల ముడుపుల పై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

ఆనాడు అదానీ డీల్ పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడెందుకు మౌనం పాటిస్తోందని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని, సోలార్ పవర్ డీల్ లో జగన్ కి 1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడి అయ్యింద‌ని తెలిపారు. అమెరికా ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆధారాలు కూడా బయట పెట్టాయ‌న్నారు. విదేశాల్లోనే ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా? అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఇంత అవినీతి జరిగితే మన రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదన్నారు.

జ‌గ‌న్ అదానీ లంచాల కార‌ణంగా.. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం ప‌డింద‌ని ష‌ర్మిల ఆరోపించారు. అదానీతో 25 ఏళ్ల ఒప్పందం అంటే రాష్ట్రం నెత్తిన ఆర్థిక‌ భారం పడుతుందన్నారు. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేదని, ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గిందన్నారు. వ‌చ్చే రోజుల్లో సోలార్ యూనిట్ ధ‌ర రూ.050 పైసలకే వచ్చినా రావొచ్చ‌ని తెలిపారు. అలాంటి ప‌వ‌ర్ కోసం 25 ఏళ్లకు అగ్రిమెంట్ ఎలా చేశార‌ని జ‌గ‌న్‌ను నిల‌దీశారు.

యూనిట్ రూ.2.49 పైసలకు కొని రాష్ట్రం నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు మోపారని ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ సైతం అదాని అరాచ‌కాల‌పైనా అవినీతి అక్ర‌మాల‌పైనా పార్ల‌మెంటులో పోరాటం చేస్తున్న‌ట్టు చెప్పారు. అదానీ వ్య‌వ‌హారంపై జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారని, తాము రాష్ట్రంలో ఆందోళ‌న‌లు చేస్తున్న‌ట్టు ష‌ర్మిల చెప్పుకొచ్చారు. ఈ కేసులో జగ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

This post was last modified on December 5, 2024 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

1 hour ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

2 hours ago

ఎండలు…క్రికెట్ మ్యాచులు…థియేటర్లలో ఖాళీ కుర్చీలు

బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…

2 hours ago

అమ‌రావ‌తికి డ‌బ్బే డ‌బ్బు.. మాట‌లు కాదు చేత‌లే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. డ‌బ్బులు ఇచ్చే వారి కోసం స‌ర్కారు ఎదురు చూసింది. గ‌త వైసీపీ…

2 hours ago

అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

2 hours ago

దేవా కట్టాపై రాజమౌళి ప్రేమ,

దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…

3 hours ago