తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కీలక అధికారులు ప్రస్తుతం జైల్లో ఉండగా.. మరొకరు విదేశాలకు కూడా వెళ్లిపోయారు. ఇక, ఈ కేసులో మాజీ మంత్రి హరీష్రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్రావుపై కేసు పెట్టారు. దీంతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన హరీష్రావు.. హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని.. దీనిని క్వాష్ చేయాలని కోరుతూ.. ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో హరీష్రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది.
అయితే.. హరీష్రావు పోలీసులకు సహకరించాలని.. విచారణకు పిలిచినప్పుడు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను నిశితంగా గమనిస్తున్నామన్న హైకోర్టు.. కేసులు రాజకీయ ఉద్దేశంతోనే పెట్టి ఉంటే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరోవైపు కేసులు పెట్టిన చక్రధర్రావుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఏంటీ కేసు?
హైదరాబాద్ నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.. చక్రధర్ గౌడ్.. బీఆర్ఎస్ హయాంలో పనులు చేసుకున్నారు. అయితే.. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. దీనివల్ల.. తన ప్రతిష్ట వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని గౌడ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇక్కడే హరీష్ రావు కీలక విషయం ప్రస్తావించారు. తనపై కేసు నమోదు చేసిన పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వలేదని, ప్రాథమిక సమాచారం కూడా సేకరించకుండానే వ్యవహరించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లారు.
This post was last modified on December 5, 2024 3:08 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…