మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించిన నేపథ్యంలోనే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు బిజెపి ఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఫడ్నవీస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు.
టెక్నికల్ గా తను ముఖ్యమంత్రి అయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రులు షిండే, అజిత్ పవర్ లతో తాను కలిసి పని చేస్తానని తెలిపారు. రెండున్నర ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించిన విషయాన్ని షిండే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించే అవకాశం తనకు వచ్చిందని షిండే అన్నారు. ఏది ఏమైనా 10 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయింది.
This post was last modified on December 4, 2024 10:46 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…