మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించిన నేపథ్యంలోనే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు బిజెపి ఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఫడ్నవీస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు.
టెక్నికల్ గా తను ముఖ్యమంత్రి అయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రులు షిండే, అజిత్ పవర్ లతో తాను కలిసి పని చేస్తానని తెలిపారు. రెండున్నర ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించిన విషయాన్ని షిండే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించే అవకాశం తనకు వచ్చిందని షిండే అన్నారు. ఏది ఏమైనా 10 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయింది.
This post was last modified on December 4, 2024 10:46 pm
సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…