మహారాష్ట్రకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరి వరకు షిండే సీఎం పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి పెద్దలు భావించడంతో షిండే డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
షిండే తో పాటు అజిత్ పవర్ కూడా రేపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని షిండే ప్రకటించిన నేపథ్యంలోనే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు బిజెపి ఎల్పీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఫడ్నవీస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు.
టెక్నికల్ గా తను ముఖ్యమంత్రి అయినప్పటికీ డిప్యూటీ ముఖ్యమంత్రులు షిండే, అజిత్ పవర్ లతో తాను కలిసి పని చేస్తానని తెలిపారు. రెండున్నర ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించిన విషయాన్ని షిండే ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించే అవకాశం తనకు వచ్చిందని షిండే అన్నారు. ఏది ఏమైనా 10 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయింది.
This post was last modified on December 4, 2024 10:46 pm
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…