Political News

ప్రభుత్వంపై పోరుబాటకు జగన్ పిలుపు

ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ విమర్శలకు దిగారు. ఆరు నెలలలోనే ఇంత ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని జగన్ అన్నారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అంటూ సెటైర్లు వేశారు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 11 నుంచి కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని వైసీపీకి నేతలు కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 11వ తేదీన రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు చేయాలని, ఆయా జిల్లాల కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని జగన్ పిలుపునిచ్చారు. రైతులకు 20వేల రూపాయల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక, డిసెంబర్ 27వ తేదీన పెంచిన విద్యుత్ చార్జీలపై ఆందోళన చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు.

విద్యుత్ ఎస్సీ కార్యాలయాలు, సిఎండి కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పారు. ఇక, జనవరి మూడో తేదీన ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై పోరాడాలని, పెండింగ్ ఫీజుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

కూటమి నేతలను ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని జగన్ అన్నారు. కరెంటు ఛార్జీలను బాదే పనులు మొదలయ్యాయని విమర్శించారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

This post was last modified on December 4, 2024 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సన్ రైజర్స్ గెలుపు : ప్రేమంటే ఇదేరా లింకు

నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ చూసి క్రికెట్ అభిమానులు ఊగిపోయారు. ముఖ్యంగా అభిషేక్…

10 minutes ago

విశ్వంభర టీజర్లో చూసింది సినిమాలో లేదా

గత ఏడాది విశ్వంభర టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిదో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. అందుకే నెలల తరబడి…

37 minutes ago

హిట్ 3 హింస అంచనాలకు మించి

ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…

3 hours ago

‘టాప్’ లేపిన తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…

5 hours ago

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

8 hours ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

9 hours ago