సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సిక్కుల మత పెద్దలు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ సహా .. అప్పటి ఆయన మంత్రివర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మతాచారం ప్రకారం.. కఠిన శిక్షలు విధించింది. మళ్లీ మత పెద్దలు వద్దని చెప్పే వరకు ఈ శిక్షలు కొనసాగించాలి. ఈ క్రమంలో సుఖ్బీర్ సింగ్ మంగళవారం ఉదయం నుంచి ద్వారపాలకుడిగా శిక్ష అనుభవిస్తున్నారు. చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పును పేర్కొంటూ.. రాసిన పలక ధరించి ఆయన శిక్షను అనుభవిస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా.. ఇదే విధంగా సుఖ్బీర్ శిక్షను అనుభవించేందుకు వీల్ చైర్లో వచ్చారు. ఆయన వచ్చిన గంట అనంతరం.. స్వర్ణ దేవాలయానికి.. భక్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వయసున్న సిక్కు వ్యక్తి ఒకరు.. సుఖ్బీర్కు అతి సమీపంలోకి వచ్చారు. అయితే.. సుఖ్బీర్ సమీపానికి వద్దంటూ.. మాజీ సీఎం అనుచరుడు ఒకరు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమగా .. సుఖ్బీర్ వైపు నకు వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా మొలలో దాచుకున్న తుపాకీని బయటకు తీసి కాల్పులు జరిపాడు.
అయితే.. ఈ ఘటనను పరిశీలిస్తున్న సమీపంలోని సుఖ్బీర్ మరో అనుచరుడు సదరు వ్యక్తిని గట్టిగా అడ్డుకుని పక్కకు తోసుకుని వెళ్లిపోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భద్రతా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించడం ఏంటంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
This post was last modified on December 4, 2024 2:14 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…