సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సిక్కుల మత పెద్దలు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ సహా .. అప్పటి ఆయన మంత్రివర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మతాచారం ప్రకారం.. కఠిన శిక్షలు విధించింది. మళ్లీ మత పెద్దలు వద్దని చెప్పే వరకు ఈ శిక్షలు కొనసాగించాలి. ఈ క్రమంలో సుఖ్బీర్ సింగ్ మంగళవారం ఉదయం నుంచి ద్వారపాలకుడిగా శిక్ష అనుభవిస్తున్నారు. చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పును పేర్కొంటూ.. రాసిన పలక ధరించి ఆయన శిక్షను అనుభవిస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా.. ఇదే విధంగా సుఖ్బీర్ శిక్షను అనుభవించేందుకు వీల్ చైర్లో వచ్చారు. ఆయన వచ్చిన గంట అనంతరం.. స్వర్ణ దేవాలయానికి.. భక్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వయసున్న సిక్కు వ్యక్తి ఒకరు.. సుఖ్బీర్కు అతి సమీపంలోకి వచ్చారు. అయితే.. సుఖ్బీర్ సమీపానికి వద్దంటూ.. మాజీ సీఎం అనుచరుడు ఒకరు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమగా .. సుఖ్బీర్ వైపు నకు వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా మొలలో దాచుకున్న తుపాకీని బయటకు తీసి కాల్పులు జరిపాడు.
అయితే.. ఈ ఘటనను పరిశీలిస్తున్న సమీపంలోని సుఖ్బీర్ మరో అనుచరుడు సదరు వ్యక్తిని గట్టిగా అడ్డుకుని పక్కకు తోసుకుని వెళ్లిపోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భద్రతా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించడం ఏంటంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
This post was last modified on December 4, 2024 2:14 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…