సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సిక్కుల మత పెద్దలు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ సహా .. అప్పటి ఆయన మంత్రివర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మతాచారం ప్రకారం.. కఠిన శిక్షలు విధించింది. మళ్లీ మత పెద్దలు వద్దని చెప్పే వరకు ఈ శిక్షలు కొనసాగించాలి. ఈ క్రమంలో సుఖ్బీర్ సింగ్ మంగళవారం ఉదయం నుంచి ద్వారపాలకుడిగా శిక్ష అనుభవిస్తున్నారు. చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పును పేర్కొంటూ.. రాసిన పలక ధరించి ఆయన శిక్షను అనుభవిస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా.. ఇదే విధంగా సుఖ్బీర్ శిక్షను అనుభవించేందుకు వీల్ చైర్లో వచ్చారు. ఆయన వచ్చిన గంట అనంతరం.. స్వర్ణ దేవాలయానికి.. భక్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వయసున్న సిక్కు వ్యక్తి ఒకరు.. సుఖ్బీర్కు అతి సమీపంలోకి వచ్చారు. అయితే.. సుఖ్బీర్ సమీపానికి వద్దంటూ.. మాజీ సీఎం అనుచరుడు ఒకరు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమగా .. సుఖ్బీర్ వైపు నకు వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా మొలలో దాచుకున్న తుపాకీని బయటకు తీసి కాల్పులు జరిపాడు.
అయితే.. ఈ ఘటనను పరిశీలిస్తున్న సమీపంలోని సుఖ్బీర్ మరో అనుచరుడు సదరు వ్యక్తిని గట్టిగా అడ్డుకుని పక్కకు తోసుకుని వెళ్లిపోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భద్రతా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించడం ఏంటంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
This post was last modified on December 4, 2024 2:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…