సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సిక్కుల మత పెద్దలు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ సహా .. అప్పటి ఆయన మంత్రివర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మతాచారం ప్రకారం.. కఠిన శిక్షలు విధించింది. మళ్లీ మత పెద్దలు వద్దని చెప్పే వరకు ఈ శిక్షలు కొనసాగించాలి. ఈ క్రమంలో సుఖ్బీర్ సింగ్ మంగళవారం ఉదయం నుంచి ద్వారపాలకుడిగా శిక్ష అనుభవిస్తున్నారు. చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పును పేర్కొంటూ.. రాసిన పలక ధరించి ఆయన శిక్షను అనుభవిస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా.. ఇదే విధంగా సుఖ్బీర్ శిక్షను అనుభవించేందుకు వీల్ చైర్లో వచ్చారు. ఆయన వచ్చిన గంట అనంతరం.. స్వర్ణ దేవాలయానికి.. భక్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వయసున్న సిక్కు వ్యక్తి ఒకరు.. సుఖ్బీర్కు అతి సమీపంలోకి వచ్చారు. అయితే.. సుఖ్బీర్ సమీపానికి వద్దంటూ.. మాజీ సీఎం అనుచరుడు ఒకరు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమగా .. సుఖ్బీర్ వైపు నకు వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా మొలలో దాచుకున్న తుపాకీని బయటకు తీసి కాల్పులు జరిపాడు.
అయితే.. ఈ ఘటనను పరిశీలిస్తున్న సమీపంలోని సుఖ్బీర్ మరో అనుచరుడు సదరు వ్యక్తిని గట్టిగా అడ్డుకుని పక్కకు తోసుకుని వెళ్లిపోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భద్రతా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించడం ఏంటంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
This post was last modified on December 4, 2024 2:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…