సిక్కు మత పెద్దలు విధించిన శిక్షను శిరసావహిస్తూ.. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ప్రధాన ద్వారం వద్ద.. ద్వారపాలకుడిగా కూర్చున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యా యత్నం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మాజీ సీఎం.. వీల్ చైర్లోనే కూర్చుని ఈ శిక్షను అనుభవిస్తున్నారు. పక్కన ఆయన అనుచరులు మాత్రమే ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద డేరా బాబాకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో సిక్కుల మత పెద్దలు.. మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ సహా .. అప్పటి ఆయన మంత్రివర్గాన్ని దోషులుగా తేలుస్తూ.. మతాచారం ప్రకారం.. కఠిన శిక్షలు విధించింది. మళ్లీ మత పెద్దలు వద్దని చెప్పే వరకు ఈ శిక్షలు కొనసాగించాలి. ఈ క్రమంలో సుఖ్బీర్ సింగ్ మంగళవారం ఉదయం నుంచి ద్వారపాలకుడిగా శిక్ష అనుభవిస్తున్నారు. చేతిలో ఈటె పట్టుకుని, మెడలో చేసిన తప్పును పేర్కొంటూ.. రాసిన పలక ధరించి ఆయన శిక్షను అనుభవిస్తున్నారు.
బుధవారం ఉదయం కూడా.. ఇదే విధంగా సుఖ్బీర్ శిక్షను అనుభవించేందుకు వీల్ చైర్లో వచ్చారు. ఆయన వచ్చిన గంట అనంతరం.. స్వర్ణ దేవాలయానికి.. భక్తుడిగా విచ్చేసిన ఓ 50 ఏళ్ల వయసున్న సిక్కు వ్యక్తి ఒకరు.. సుఖ్బీర్కు అతి సమీపంలోకి వచ్చారు. అయితే.. సుఖ్బీర్ సమీపానికి వద్దంటూ.. మాజీ సీఎం అనుచరుడు ఒకరు చేయి చూపిస్తున్నా.. నెమ్మది అడుగులో అడుగు వేసుకుంటూ.. అత్యంత ప్రేమగా .. సుఖ్బీర్ వైపు నకు వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా మొలలో దాచుకున్న తుపాకీని బయటకు తీసి కాల్పులు జరిపాడు.
అయితే.. ఈ ఘటనను పరిశీలిస్తున్న సమీపంలోని సుఖ్బీర్ మరో అనుచరుడు సదరు వ్యక్తిని గట్టిగా అడ్డుకుని పక్కకు తోసుకుని వెళ్లిపోవడంతో తూటాలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. ఈ ఘటనతో స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ సీఎంను ఎలాంటి భద్రతా లేకుండా కూర్చోబెట్టి శిక్ష విధించడం ఏంటంటూ.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
This post was last modified on December 4, 2024 2:14 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…