వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో రాజకీయం కాదు.. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తన `బాదుడే-బాదుడు` కార్యక్రమంలో వీక్షించిన చంద్రబాబు.. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు. పులివెందులతో పాటు శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉపశమనం కల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం కట్టడి సహా.. జల్ జీవన్ మిషన్ పైనా చర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింత మందికి విస్తరించేందుకు(ముఖ్యంగా గిరిజనులకు కూడా) కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మరిన్ని నిర్ణయాలు ఇవీ..
+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది.
This post was last modified on December 3, 2024 8:27 pm
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…