Political News

జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి తాగునీరు..

వైసీపీ అదినేత‌, మాజీసీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీటిని అందించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇదేదో రాజ‌కీయం కాదు.. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను స్వ‌యంగా త‌న `బాదుడే-బాదుడు` కార్య‌క్ర‌మంలో వీక్షించిన చంద్ర‌బాబు.. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నా రు. పులివెందుల‌తో పాటు శ్రీకాకుళంలో తాగునీరు క‌లుషితమైన కార‌ణంగా కిడ్నీ వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి కూడా ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇత‌ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్ర‌మంగా విదేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న రేష‌న్ బియ్యం క‌ట్టడి స‌హా.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పైనా చ‌ర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కాన్ని మ‌రింత మందికి విస్త‌రించేందుకు(ముఖ్యంగా గిరిజ‌నుల‌కు కూడా) కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది.

మ‌రిన్ని నిర్ణ‌యాలు ఇవీ..

+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది. 

This post was last modified on December 3, 2024 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago