వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో రాజకీయం కాదు.. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తన `బాదుడే-బాదుడు` కార్యక్రమంలో వీక్షించిన చంద్రబాబు.. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు. పులివెందులతో పాటు శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉపశమనం కల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం కట్టడి సహా.. జల్ జీవన్ మిషన్ పైనా చర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింత మందికి విస్తరించేందుకు(ముఖ్యంగా గిరిజనులకు కూడా) కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మరిన్ని నిర్ణయాలు ఇవీ..
+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది.
This post was last modified on December 3, 2024 8:27 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…