Political News

జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికి తాగునీరు..

వైసీపీ అదినేత‌, మాజీసీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు స్వ‌చ్ఛ‌మైన తాగునీటిని అందించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది. ఇదేదో రాజ‌కీయం కాదు.. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను స్వ‌యంగా త‌న `బాదుడే-బాదుడు` కార్య‌క్ర‌మంలో వీక్షించిన చంద్ర‌బాబు.. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నా రు. పులివెందుల‌తో పాటు శ్రీకాకుళంలో తాగునీరు క‌లుషితమైన కార‌ణంగా కిడ్నీ వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి కూడా ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇత‌ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్ర‌మంగా విదేశాల‌కు ఎగుమ‌తి అవుతున్న రేష‌న్ బియ్యం క‌ట్టడి స‌హా.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పైనా చ‌ర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కాన్ని మ‌రింత మందికి విస్త‌రించేందుకు(ముఖ్యంగా గిరిజ‌నుల‌కు కూడా) కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది.

మ‌రిన్ని నిర్ణ‌యాలు ఇవీ..

+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది. 

This post was last modified on December 3, 2024 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

29 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago