వైసీపీ అదినేత, మాజీసీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఇదేదో రాజకీయం కాదు.. అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తన `బాదుడే-బాదుడు` కార్యక్రమంలో వీక్షించిన చంద్రబాబు.. ఈ మేరకు తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు. పులివెందులతో పాటు శ్రీకాకుళంలో తాగునీరు కలుషితమైన కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉపశమనం కల్పించారు. ఉద్దానంలోనూ తాగునీటిని అందించే ప్రాజెక్టుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం కట్టడి సహా.. జల్ జీవన్ మిషన్ పైనా చర్చించారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింత మందికి విస్తరించేందుకు(ముఖ్యంగా గిరిజనులకు కూడా) కేబినెట్ పచ్చజెండా ఊపింది.
మరిన్ని నిర్ణయాలు ఇవీ..
+ హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం లభించింది.
+ ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు కేబినెట్ ఓ కే చెప్పింది.
This post was last modified on December 3, 2024 8:27 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…