Political News

హైడ్రా కోసం 50 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ గ్రోత్ డెవలప్‌మెంట్ అథారిటీ) అభివృద్ధికి కీలకమైన నిధులను మంజూరు చేసింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధులతో కార్యాలయ నిర్వహణకు అవసరమైన వాహనాల కొనుగోలు, ఇతర కార్యకలాపాలను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పురపాలక శాఖ ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది.

మరోవైపు, హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేత కార్యక్రమాలను శరవేగంగా చేపట్టారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పోరేషన్‌లోని అల్మాస్‌గూడ గ్రామంలో శ్రీవెంకటేశ్వర కాలనీలో ఉన్న పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన రెడిమేడ్ కంటైనర్‌ను తొలగించారు. ఈ చర్యలు హైడ్రా ఇన్‌స్పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో నిర్వహించారు.

అక్రమ నిర్మాణాల తొలగింపుపై స్థానికులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఒకవైపు హైడ్రా చర్యలను స్వాగతించిన వారు, ప్రజలకు పార్క్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు తమ జీవితాధారాలను కోల్పోయామంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులు, స్థానిక సంస్థల మధ్య సమన్వయం తో ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

హైడ్రా నిధుల విడుదలతో అభివృద్ధికి మరింత ఊతం కలిగే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడంతో పాటు, మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా హైడ్రా దృష్టి సారిస్తోంది. తాజా చర్యలు ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పాటుగా నిలుస్తాయని స్థానిక అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్స్ ను కూడా నిర్మించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

Satya

Recent Posts

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

1 minute ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

11 minutes ago

‘రాహుల్ గాంధీ పెద్ద జోక్’

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…

14 minutes ago

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

23 minutes ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

34 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

34 minutes ago