Political News

పవన్ పగబడితే ఇట్టా ఉంటదా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌గబ‌డితే ఇలా ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. వ్యాపార వ‌ర్గాల్లోనూ వినిపిస్తున్న మాట‌. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న‌ ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి జ‌న‌సేన‌పైనా.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తోపాటు.. రాజ‌కీయంగా కూడా.. ప‌వ‌న్‌ను ఆయ‌న టార్గెట్ చేశారు. బ‌హిరంగ స‌వాళ్లు కూడా గుప్పించారు.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కాకినాడ‌లో నిర్వ‌హించిన వారాహి యాత్ర సంద‌ర్భంగా అదే రేంజ్‌లో ద్వారంపూడిపై విరుచుకుపడ్డారు. “మీ అక్ర‌మాల‌ను వెలికి తీసి.. న‌డిరోడ్డుపై నిల‌బెట్ట‌క‌పోతే.. నా పేరు ప‌వ‌న్ క‌ల్యాణే కాదు” అని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేశారు. అయితే.. ఈ ప్ర‌తిజ్ఞ‌ను కూడా ద్వారంపూడి లైట్ తీసుకున్నారు. “ముందు నువ్వు గెలిచి చూపించు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ 100% స్ట్రైక్ రేట్‌తో ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

ఆ త‌ర్వాత‌.. ద్వారంపూడి వ్యాపార ద్వారాలు ఒక్కొక్క‌టిగా బ‌ద్ద‌ల‌వ్వ‌డం ప్రారంభమ‌య్యాయి. పౌర స‌ర‌ఫరాల శాఖ‌ను ప‌వ‌న్ తీసుకోవ‌డం.. దీనికి మంత్రిగా త‌న విధేయుడైన నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించడం .. ఆయ‌న దూకుడుగా వ‌చ్చిన తొలినాళ్ల‌లోనే కాకినాడ‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని రైసు మిల్లుల‌ను టార్గెట్ చేసుకుని విస్తృత త‌నిఖీలు చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వెయ్యికిపైగా కేసులు న‌మోదు చేసిన‌ట్టు తాజాగా నాదెండ్ల వెల్ల‌డించారు.

ఇక‌, మ‌రోవైపు కాకినాడ పోర్టులో అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న రేష‌న్ బియ్యంపైనా ప‌వ‌న్ కొర‌డా ఝ‌ళిపించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఈ విషయంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఐపీఎస్ అధికారితో క‌మిటీ కూడా నియ‌మించింది. మ‌రోవైపు.. కాకినాడ‌లోని క‌ర‌ప‌లో ఉన్న వీర‌భ‌ద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రొయ్య‌ల ఫ్యాక్ట‌రీని ఆగ‌స్టు 6నే పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు మూసివేసింది. తాజాగా లంప‌క‌లోవ‌లో ఉన్న మరో ఫ్యాక్టరీని కూడా మూసి వేశారు. దీంతో ద్వారంపూడికి భారీ షాక్ త‌గిలింది.

సుదీర్ఘ అధ్య‌య‌నం..

ద్వారంపూడి అక్ర‌మాల‌ను వెలికి తీసేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలానే అధ్య‌య‌నం చేసినట్టు తెలుస్తోంది. కాకినాడ‌కు గ‌తంలోనే వ‌చ్చిన ఆయ‌న ఇక్క‌డే తిష్ఠ వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో రాజ‌కీయంగా ఆయ‌న వ‌చ్చార‌ని అనుకున్నారు. కానీ, ద్వారంపూడి వ్యాపారాల‌కు సంబంధించిన అక్ర‌మాల‌పై కూపీ లాగిన‌ట్టు తెలిసింది. వాటి ఆధారంగానే తాజాగా ప‌క్కా చ‌ర్య‌ల‌కు దిగార‌ని స‌మాచారం. మొత్తానికి ప‌వ‌న్ ప‌గ బ‌డితే ఎలా ఉంటుంద‌నే విష‌యం తాజా చ‌ర్చ‌ల‌తో స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 3, 2024 11:38 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

13 minutes ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

4 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

6 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

6 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

7 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

8 hours ago