Political News

ప‌ది నెల‌ల్లోనే అద్బుతాలు జ‌రుగుతాయా?: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌ది మాసాలే అయింద‌ని.. ఈ ప‌ది మాసాల్లోనే అద్భుతాలు జ‌రిగిపోతాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కులు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లే త‌మ ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌ని కూడా ఆయ‌న సూచించారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌బుత్వానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమీలేద‌న్న ఆయ‌న విప‌క్షాలు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకునే బాధ్య‌త ప్ర‌జ‌లపైనే ఉంద‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచి స‌హ‌కారం కోరుతున్నామ‌న్నారు.

ప‌దేళ్ల దుష్టల పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌లు భంగ‌ప‌డ్డాయ‌ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వాటిని ఇప్పుడు బాగు చేస్తున్నామ‌ని తెలిపారు. అయినా.. మ‌రోవైపు ఈ ప‌ది మాసాల కాలంలోనే అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన గ్యారెంటీల‌ను అమలు చేస్తున్న‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వంపై ప‌ని గ‌ట్టుకుని కొంద‌రు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. ఇది ఒక‌రిద్ద‌రితో పోయేది కాద‌ని.. ప్ర‌జ‌లంతా స‌మైక్యంగా ఉంటూ.. ఈ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌నికోరారు. “మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే” అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

“మా త‌ల రాత‌ల‌ను మార్చి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునే పెద్ద‌బాధ్య‌త‌లు ప్ర‌జ‌లుఅప్ప‌గించారు. ఇప్పుడు విప‌క్షాలు చేస్తున్న విష ప్ర‌చారాన్ని కూడా మీరే తిప్పికొట్టాలి” అని సీఎం రేవంత్ అన్నారు. రైతుల‌ను ఘోష పెట్టిన మోడీ.. నల్లచట్టాలు తెచ్చార‌ని, వరి వేస్తే ఉరి త‌ప్ప‌దంటూ.. కేసీఆర్ అప్ప‌ట్లో అన్నం పెట్టే రైతుల‌ను బెదిరించార‌ని రేవంత్ చెప్పారు. కానీ, ఇప్పుడు వారే.. రైతుల‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. వీరి మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించామ‌ని సీఎం రేవంత్ చెప్పారు. రైతుల‌కు రుణ మాఫీ చేస్తున్నామ‌న్నారు. స‌న్నాలు పండించే రైతుల‌కు 500 రూపాయ‌ల వ‌ర‌కు బోన‌స్ ఇస్తున్న‌ట్టు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని, త‌మ హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు 50 వేల వ‌ర‌కు ఉద్యోగాలు ఇచ్చిన‌ట్టు సీఎం తెలిపారు. అయినా.. ప్ర‌తిప‌క్షాలు కుట్ర చేస్తున్నాయ‌ని, ఏమీ చేయ‌లేద‌ని వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లే తిప్పికొట్టాల‌ని సీఎం రేవంత్ సూచించారు.

This post was last modified on December 2, 2024 10:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

32 minutes ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

46 minutes ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

1 hour ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

2 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

2 hours ago

భార‌త్‌పై ట్రంప్ సెగ‌… 50 కాదు… 500 శాతం?

భార‌త్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌నను సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌ని బాహాటంగానే…

2 hours ago