Political News

ప‌ది నెల‌ల్లోనే అద్బుతాలు జ‌రుగుతాయా?: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌ది మాసాలే అయింద‌ని.. ఈ ప‌ది మాసాల్లోనే అద్భుతాలు జ‌రిగిపోతాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ నాయ‌కులు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లే త‌మ ప్ర‌భుత్వాన్ని కాపాడాల‌ని కూడా ఆయ‌న సూచించారు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌బుత్వానికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమీలేద‌న్న ఆయ‌న విప‌క్షాలు చేస్తున్న విష ప్ర‌చారాన్ని అడ్డుకునే బాధ్య‌త ప్ర‌జ‌లపైనే ఉంద‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచి స‌హ‌కారం కోరుతున్నామ‌న్నారు.

ప‌దేళ్ల దుష్టల పాల‌న‌లో వ్య‌వ‌స్థ‌లు భంగ‌ప‌డ్డాయ‌ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. వాటిని ఇప్పుడు బాగు చేస్తున్నామ‌ని తెలిపారు. అయినా.. మ‌రోవైపు ఈ ప‌ది మాసాల కాలంలోనే అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన గ్యారెంటీల‌ను అమలు చేస్తున్న‌ట్టు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వంపై ప‌ని గ‌ట్టుకుని కొంద‌రు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. ఇది ఒక‌రిద్ద‌రితో పోయేది కాద‌ని.. ప్ర‌జ‌లంతా స‌మైక్యంగా ఉంటూ.. ఈ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని అడ్డుకోవాల‌నికోరారు. “మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే” అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

“మా త‌ల రాత‌ల‌ను మార్చి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునే పెద్ద‌బాధ్య‌త‌లు ప్ర‌జ‌లుఅప్ప‌గించారు. ఇప్పుడు విప‌క్షాలు చేస్తున్న విష ప్ర‌చారాన్ని కూడా మీరే తిప్పికొట్టాలి” అని సీఎం రేవంత్ అన్నారు. రైతుల‌ను ఘోష పెట్టిన మోడీ.. నల్లచట్టాలు తెచ్చార‌ని, వరి వేస్తే ఉరి త‌ప్ప‌దంటూ.. కేసీఆర్ అప్ప‌ట్లో అన్నం పెట్టే రైతుల‌ను బెదిరించార‌ని రేవంత్ చెప్పారు. కానీ, ఇప్పుడు వారే.. రైతుల‌పై ప్రేమ ఒల‌క‌బోస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. వీరి మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించామ‌ని సీఎం రేవంత్ చెప్పారు. రైతుల‌కు రుణ మాఫీ చేస్తున్నామ‌న్నారు. స‌న్నాలు పండించే రైతుల‌కు 500 రూపాయ‌ల వ‌ర‌కు బోన‌స్ ఇస్తున్న‌ట్టు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని, త‌మ హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు 50 వేల వ‌ర‌కు ఉద్యోగాలు ఇచ్చిన‌ట్టు సీఎం తెలిపారు. అయినా.. ప్ర‌తిప‌క్షాలు కుట్ర చేస్తున్నాయ‌ని, ఏమీ చేయ‌లేద‌ని వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లే తిప్పికొట్టాల‌ని సీఎం రేవంత్ సూచించారు.

This post was last modified on December 2, 2024 10:14 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

35 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

2 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

2 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago