కేతిరెడ్డి పెద్దారెడ్డి 70+, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70+.. ఇద్దరూ సీనియర్ రాజకీయ నేతలే. పైగా తమ తమ నియోజకవర్గాల్లో తాముచెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి సైలెంట్ అయితే.. పెద్దారెడ్డి ‘పుష్ప’ టైపు! కానీ, ఇద్దరూ కూడా చాపకింద నీరులా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి.. మంత్రి కూడా. దీంతో ఆయనకు చిత్తూరు వ్యాప్తంగా తిరుగులేకుండా పోయింది.
ఇక, పెద్దారెడ్డికి మంత్రి పదవి దక్కలేదు కానీ.. ఆయన అప్రకటిత మంత్రిగానే అనంతపురంలో రాజకీయాలు చేశారు. నిజానికి అప్పటి వైసీపీ నాయకులు జిల్లాను విభజించుకుని పాలించారని చెప్పడంలోనూ సందేహం లేదు. దీంతో నిత్యం పెద్దారెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇక, పెద్దిరెడ్డి పైకి మౌనంగా ఉన్నా.. తెరవెనుక ఆయన సైన్యం పెద్దది. దీంతో ఆయన కనుసైగలతోనే కథను నడిపించేశారు. ఆయన దెబ్బకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న(తర్వాత మంత్రి) రోజా కన్నీరు మున్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే.. కథ ఎప్పుడూ పాజిటివ్గానే సాగిపోదు కదా! తాజా ఎన్నికల్లో పెద్దారెడ్డికి ప్రజలు శ్రీముఖం చూపించారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక, పెద్దిరెడ్డి పుంగనూరులో అతి కష్టం మీద విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరి పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్గా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇద్దరూ కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇద్దరిపైనా స్థానిక అధికారులు ఆంక్షలు విదించారు.
పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా.. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి మూడు మాసాలైంది. దీనిపై ఆయ న న్యాయ పోరాటం చేయాలనిఅనుకున్నా.. నిపుణుల సూచనల మేరకు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తాడి పత్రికి కడు దూరంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు.. అనుమతి తీసుకుని తాడిపత్రి లోని ఇంటికి వస్తున్నారు. ఇక, పెద్దిరెడ్డి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గం లోకి ఆయన వెళ్లరాదంటూ.. కలెక్టర్ ఆదేశించి మూడు మాసాలైంది. దీనిపై ఈయన మాత్రం న్యాయపో రాటంచేస్తున్నారు. కానీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇద్దరూ కూడా.. సేమ్ టు సేమ్ సిట్యుయేషన్ను ఎదుర్కొంటుండడం గమనార్హం.
This post was last modified on December 1, 2024 6:48 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…