Political News

టీటీడీలో మ‌రిన్ని ప‌ద‌వులు.. జాబితా కూడా పెద్ద‌దే!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీలో కూట‌మి స‌ర్కారుకు ఆప‌శోపాలు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లే.. టీటీడీ పాల‌క మండలిని సీఎం చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ ప‌ద‌వుల కోసం చాంతాడంత జాబితా వ‌చ్చింది. దీంతో తాను ముందుగానే నిర్ణ‌యించుకున్న విధంగా చంద్ర‌బాబు అడుగులు వేశారు. వాస్త‌వానికి పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి కోసం.. పెద్ద ఎత్తున నాయ‌కులు క్యూ క‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆచి తూచి నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ఇప్పుడు ఇదే తిరుమ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. వీటిలో శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్‌, అదేవిధంగా ఈ ఛానెల్‌కు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(సీఈవో), స‌ల‌హాదారు, ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వులు ఎదురు చూస్తున్నాయి. వీటితో పాటు.. శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్ ప‌ద‌వి కూడా ఉంది. ఇవ‌న్నీ టీటీడీలో ప్రాధాన్యం ఉన్న‌వే కావ‌డం విశేషం.

దీంతో ఆయా ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు కూడా ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా ఎదురు చూస్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్ కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో ఇది వివాద‌మైంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రాఘ‌వేంద్ర రావు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న‌తోపాటు ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌, నిర్మాత సి. అశ్వినీద‌త్‌లు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎస్వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని తెలిసింది. ఈ ప‌ద‌వుల‌పై జ‌న‌సేన నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే తిరుప‌తికి చెందిన యువ‌నాయ‌కుడు, ఎన్నిక‌ల్లో టికెట్ఆశించి భంగ ప‌డిన జ‌న‌సైనికుడు ఎస్వీబీసీ చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కురాలు సుగుణ‌మ్మ కూడా నామినేటెడ్ ప‌ద‌విపై మంత్రి నారా లోకేష్‌ను అభ్య‌ర్థించారు. అటు సినీ రంగానికి చెందిన‌వారు. ఇటు రాజ‌కీయ రంగానికి చెందిన‌వారు .. కూడా ఈ ప‌ద‌వుల కోసం ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 30, 2024 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

9 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

45 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago