Political News

టీటీడీలో మ‌రిన్ని ప‌ద‌వులు.. జాబితా కూడా పెద్ద‌దే!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీలో కూట‌మి స‌ర్కారుకు ఆప‌శోపాలు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లే.. టీటీడీ పాల‌క మండలిని సీఎం చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ ప‌ద‌వుల కోసం చాంతాడంత జాబితా వ‌చ్చింది. దీంతో తాను ముందుగానే నిర్ణ‌యించుకున్న విధంగా చంద్ర‌బాబు అడుగులు వేశారు. వాస్త‌వానికి పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి కోసం.. పెద్ద ఎత్తున నాయ‌కులు క్యూ క‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆచి తూచి నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ఇప్పుడు ఇదే తిరుమ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన ప‌ద‌వుల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. వీటిలో శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్‌, అదేవిధంగా ఈ ఛానెల్‌కు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి(సీఈవో), స‌ల‌హాదారు, ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వులు ఎదురు చూస్తున్నాయి. వీటితో పాటు.. శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్ ప‌ద‌వి కూడా ఉంది. ఇవ‌న్నీ టీటీడీలో ప్రాధాన్యం ఉన్న‌వే కావ‌డం విశేషం.

దీంతో ఆయా ప‌ద‌వుల‌ను ద‌క్కించుకునేందుకు కూడా ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా ఎదురు చూస్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ చైర్మ‌న్ కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఇచ్చారు. వైసీపీ హ‌యాంలో ఇది వివాద‌మైంది. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రాఘ‌వేంద్ర రావు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న‌తోపాటు ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్‌, నిర్మాత సి. అశ్వినీద‌త్‌లు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎస్వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని తెలిసింది. ఈ ప‌ద‌వుల‌పై జ‌న‌సేన నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే తిరుప‌తికి చెందిన యువ‌నాయ‌కుడు, ఎన్నిక‌ల్లో టికెట్ఆశించి భంగ ప‌డిన జ‌న‌సైనికుడు ఎస్వీబీసీ చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కురాలు సుగుణ‌మ్మ కూడా నామినేటెడ్ ప‌ద‌విపై మంత్రి నారా లోకేష్‌ను అభ్య‌ర్థించారు. అటు సినీ రంగానికి చెందిన‌వారు. ఇటు రాజ‌కీయ రంగానికి చెందిన‌వారు .. కూడా ఈ ప‌ద‌వుల కోసం ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 30, 2024 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

3 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

3 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago