ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కీలకమైన పదవుల భర్తీలో కూటమి సర్కారుకు ఆపశోపాలు తప్పడం లేదు. ఇటీవలే.. టీటీడీ పాలక మండలిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ పదవుల కోసం చాంతాడంత జాబితా వచ్చింది. దీంతో తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా చంద్రబాబు అడుగులు వేశారు. వాస్తవానికి పాలకమండలి చైర్మన్ పదవి కోసం.. పెద్ద ఎత్తున నాయకులు క్యూ కట్టారు. అయినప్పటికీ.. చంద్రబాబు ఆచి తూచి నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఇప్పుడు ఇదే తిరుమలకు సంబంధించి కీలకమైన పదవుల భర్తీ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. వీటిలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్, అదేవిధంగా ఈ ఛానెల్కు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో), సలహాదారు, ముఖ్య సలహాదారు పదవులు ఎదురు చూస్తున్నాయి. వీటితో పాటు.. శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్విఇటిఎ) ఛైర్మన్ పదవి కూడా ఉంది. ఇవన్నీ టీటీడీలో ప్రాధాన్యం ఉన్నవే కావడం విశేషం.
దీంతో ఆయా పదవులను దక్కించుకునేందుకు కూడా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇచ్చారు. వైసీపీ హయాంలో ఇది వివాదమైంది. ఇక, ఇప్పుడు మరోసారి రాఘవేంద్ర రావు ప్రయత్నిస్తున్నారు. ఈయనతోపాటు ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, నిర్మాత సి. అశ్వినీదత్లు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఎస్వీబీసీ సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువగానే ఉందని తెలిసింది. ఈ పదవులపై జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తిరుపతికి చెందిన యువనాయకుడు, ఎన్నికల్లో టికెట్ఆశించి భంగ పడిన జనసైనికుడు ఎస్వీబీసీ చీఫ్ అడ్వైజర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నాయకురాలు సుగుణమ్మ కూడా నామినేటెడ్ పదవిపై మంత్రి నారా లోకేష్ను అభ్యర్థించారు. అటు సినీ రంగానికి చెందినవారు. ఇటు రాజకీయ రంగానికి చెందినవారు .. కూడా ఈ పదవుల కోసం ప్రయత్నించడం గమనార్హం.
This post was last modified on November 30, 2024 10:28 pm
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…