Political News

మోదీ, కేసీఆర్ లకు రేవంత్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లగచర్ల రైతుల ఆందోళన, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రుణ మాఫీ అంటూ రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.

రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని, రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని చెప్పారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జిల్లా అభివృద్ధికి భూసేకరణ అవసరమని, అధికారులను కొడితే శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని అన్నారు. కేసీఆర్‌ కు గజ్వేల్‌లో 1000 ఎకరాల ఫామ్‌ హౌస్‌ ఉందని, కేటీఆర్‌, హరీశ్‌రావుకు పెద్దపెద్ద ఫామ్‌హౌస్‌లున్నాయని విమర్శించారు. వారు ప్రజలను రెచ్చగొట్టి కేసుల పాల్జేసి ఫామ్‌హౌస్‌లో ఉంటారని విమర్శలు గుప్పించారు.

గత ఏడాది నవంబర్‌ 30న…సరిగ్గా ఇదే తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూల్చారని గుర్తు చేసుకున్నారు. మూడేళ్లు నిండకుండానే కాళేశ్వరం కూలిందని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సాగుకు ఉచిత కరెంట్‌ పేటెంట్‌ హక్కు కాంగ్రెస్‌ దేనని తెలిపారు. పాలమూరును ఎవరో దత్తత తీసుకుంటానని ప్రకటించారని, ఈ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్‌ అనలేదా అని నిలదీశారు.

కావాలంటే ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అయినా ఇస్తామని, మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉపాధి కోసం పాలమూరు బిడ్డలు ముంబై, హైదరాబాద్‌కు వలసలు పోయే పరిస్థితి ఉందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత… ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తుచేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

This post was last modified on November 30, 2024 9:41 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

24 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

4 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago