Political News

శశికళకు ఐటి శాఖ బిగ్ షాక్

తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న వీకే శశికళకు ఆదాయపు పన్నుశాఖ బుధవారం చాలా పెద్ద షాక్ ఇచ్చింది. శశికళ+కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసేసింది. బినామీ చట్టం కింద తాము శశికళతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించటం నిజంగా కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఐటిశాఖ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో చెన్నైలోని పొయెస్ గార్డెన్ లోని ఆస్తి కూడా ఉండటం గమనార్హం.

చెన్నైలోని పొయెస్ గార్డెన్ అంటేనే ముందుగా అందరికీ దివంగత ముఖ్యమంత్రి జయలిలతే గుర్తుకొస్తారు. ఆమె ఇల్లు వేదనిలయంకు ఎదురుగా ఉన్న పెద్ద స్ధలంలో విశాలమైన భవనాన్ని నిర్మించుకోవాలని శశికళ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ స్ధలం విలువే సుమారు రూ. 300 కోట్లుంటుందని ఐటిశాఖ లెక్క కట్టింది. రూ. 300 కోట్లు పెట్టి స్ధలం కొనుగోలు చేశారంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి స్ధలంలో వేదనిలయానికి ధీటైన సువిశాలమైన భవనాన్ని కట్టుకోవాలని శశికళ అనుకున్నారు. ఆయితే ఆమెతో పాటు కుటుంబసభ్యులు కూడా అరెస్టవ్వటంతో భవనం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇపుడు ఐటిశాఖ ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో అది కూడా ఉంది.

షెల్ కంపెనీల ఏర్పాటుతో శశికళ కొనుగోలు చేసిన ఆస్తులన్నింటినీ ఐటిశాఖ గుర్తించింది. అందుకనే ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులన్నింటినీ ఫ్రీజ్ చేసేసింది. జయలలిత జీవించున్నంత కాలం చాలా బిజీగా ఉన్న శశికళ శ్రీ హరిచందన ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. విచిత్రమేమిటంటే ఈ రియల్ ఎస్టేట్ ఆఫీసు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో కూడా ఉండటం. 2003-05 మధ్యకాలంలో 200 ఎకరాలతో కలిపి 65 ఆస్తులను కూడబెట్టినట్లు ఐటిశాఖ గుర్తించింది. ఈ ఆస్తులన్నీ బినామీల పేర్లతోనే ఉండటం గమనార్హం.

పెద్దనోట్ల రద్దు సమయంలో అప్పటికప్పుడు రూ. 1674 కోట్ల విలువైన ఆస్తులను శశికళ కుటుంబం కొనుగోలు చేసింది. ఎక్కడెక్కడ ఆస్తులను కొనుగోలు చేసింది, ఎవరిపేరుతో ఆస్తులను కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా శశికళే తన బంధులకు లేఖల రూపంలో తెలియజేశారు. లేఖలు అందుకునే వరకు తమ పేర్లతో ఆస్తులున్న విషయం కూడా వాళ్ళెవరికీ తెలియదు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే ఓ పౌష్టికాహార కాంట్రాక్టర్ కు శశికళ రూ. 237 కోట్లను అప్పుగా ఇచ్చారట. ఈ లావాదేవీలన్నింటిని ఐటిశాఖ ఉన్నతాధికారులు గుర్తించి అందుకు అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్ధం చేశారు.

This post was last modified on October 8, 2020 10:38 am

Share

Recent Posts

కొత్త మెట్లు ఎక్కేసిన కిరణ్ అబ్బవరం

కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…

12 minutes ago

కారులోనే ప్రయాణమంటున్న మల్లారెడ్డి

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…

35 minutes ago

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

56 minutes ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

2 hours ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

4 hours ago